ఆ రూ. 41వేల కోట్లు గోల్ మాల్‌ కాదు.. అడ్జస్ట్‌మెంట్లు : ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన రూ. 41వేల కోట్ల నిధుల ఖర్చు వివరాలు లేవని తెలుగుదేశం పార్టీ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనాత్మకమైంది. ఈ విషయంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పేరుతో వివరణ విడుదలైంది. అయితే… అసలేం జరిగిందో పూర్తిగా చెప్పకుండా.. డొంక తిరుగుడుగా సమాధానం ఇచ్చి.. మరిన్ని అనుమానాలు పెంచేలా చేశారు… ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి. స్పెషల్ బిల్ కేటగిరీ కింద 10 వేల 806 బిల్లులకు సంబంధించి..41 వేల పైచిలుకు మొత్తాన్ని విత్ డ్రా చేశారని చెబుతున్నారని.. కానీ ఆ మొత్తాలు పలు కారణాలతో అడ్జస్ట్మెంట్ జరిగాయని ఆర్థిక శాఖ వివరించింది.

పీడీ అకౌంట్‌లోకి విడుదల చేసిన ఫండ్స్ వినియోగించకపోవడంతో.. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం లాప్స్ అయ్యాయని విరవణలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చెప్పుకొచ్చారు. అందుకే పిడి అకౌంట్స్ మధ్య అడ్జస్ట్మెంట్‌లు జరిగాయిని.. అకౌంటింగ్ యూనిట్ ఖర్చు సేమ్ హెడ్ ఆఫ్ ది అకౌంట్‌లో సరిదిద్దారని వివరించారు. ఫెయిలైన పేమెంట్లు రీ ప్రాసెసింగ్ చేయకపోవడంతో సమస్య తలెత్తిందని..అలాగే.. జీఎస్టీఎన్ లో రెగ్యులర్ బిల్లులకు టీడీఎస్ అడ్జస్ట్మెంట్ రికవరీ చేయకపోవడం ఈ అపోహ తలెత్తడానికి కారణం అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఫైనాన్షియల్ కోడ్ ఆధారంగానే ట్రాన్సక్షన్లు జరిగాయని.. రూ. 41వేల కోట్ల గోల్‌మాల్‌పై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

అయితే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన వివరణలో.. విపక్షం లేనెత్తిన అనేక ప్రశ్నలకు సమాధానం లేదు. చెల్లింపులు జరిగినట్లుగా స్పష్టంగా ఉన్నాయని .. ఈ విషయాన్ని అకౌంటెంట్ జనరల్ కూడా లేఖ రాశారని.. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. పీడీ అకౌంట్‌లలో ల్యాప్స్ అయ్యాయని చెబుతోంది. ఆర్థిక శాఖ వివరణ మరింత గందరగోళం సృష్టించేలా ఉండటంతో.. అసలు నిధుల గోల్ మాల్ గురించి బయటపడాలంటే.. కాగ్‌తో పూర్తి స్థాయి ఆడిట్ చేయించాలన్న అభిప్రాయం మాత్రం అంతటా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close