”ఆర్ధిక” శాఖతో కీచులాటలు – ఇరిగేషన్ తో తొలి పంచాయితీ!

కేటాయించిన నిధుల్ని విడుదల చేయడం లేదని రాష్ట్రప్రభుత్వంలో అన్ని శాఖల మంత్రులు, అధికారులూ ఆర్ధిక మంత్రిత్వ శాఖ మీద గుర్రుగా వున్నాయి. ”విడుదల చేసిన నిధులకు లెక్కచెప్పి కొత్త నిధులు తీసుకువెళ్ళవచ్చు. ఇందుకు వేరే శాంక్షన్లు అవసరం లేదు” అని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు బదులిస్తున్నారు. సిట్యుయేషన్ మంత్రిగారు చెప్పినంత ఈజీగా లేదు ఏదో కొర్రీవేసి రిలీజ్ ఆపేస్తున్నారు అని అధికారులు చెబుతున్నారు.

ఇందులో రెండు వాదనలూ నిజమే! ఆర్ధిక ఇబ్బందుల వల్ల నిధులు ఆపడానికి చిన్న వంక దొరికినా నిధులు ఆపేయడమూ నిజమే! ఈ స్ధితిలో మళ్ళీ డబ్బు ఎప్పుడు వస్తుందోనని రూపాయికి రెండు రూపాయల ప్రతిపాదనలు పెడుతూండటమూ నిజమే! ఈ నేపధ్యంలో తన శాఖపై పెరుగుతున్న వత్తిడిని తగ్గించుకోడానికీ, అదేసమయంలో వచ్చే బడ్జెట్ కేటాయింపులపై అవగాహన పెంచుకోడానికీ ఆర్ధిక మంత్రి రామకృష్ణుడు శాఖల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఈ వారం జలవనరుల శాఖతో సమావేశం జరుగుతుంది.

దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలతో ప్రత్యేకించి జలవనరులశాఖకు ఆర్ధిక శాఖకు మధ్య బిగుసుకుంటున్న ఘర్షణాత్మక ధోరణులను నివారించడానికి కూడా ఈ సమావేశాలు దోహదపడాలన్నది ఆర్ధిక మంత్రి ఆలోచన!

దీనికోసం నీటిపారుదల శాఖ తాను నిర్వహిస్తున్న పథకాల వివరాలు, చేసిన ఖర్చుపై నివేదిక సిద్ధం చేసింది. ఏయే పథకాలకు ఎరత నిధులు ఖర్చు చేశారు, ఎంతమేరకు పనులు జరిగాయన్నదానిపై చర్చ జరగనురది. వైఎస్‌ రాజశేఖ రరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 87 ప్రాజెక్టులతో జలయజ్ఞాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఖర్చు చేసిన నిధులకు ఫలితాలు రాకపోవడంతో ఈ పథకాల నిర్మాణంపై విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి.

కళ్లు తెరిచిన యంత్రాంగం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేసేలా ప్రాధాన్యతల క్రమాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాధాన్యతా ప్రాజెక్టులనే ముందుగా పూర్తి చేయాలన్న మాటలు పదేపదే చెప్పినప్పటికీ ఇప్పటికీ అవి పూర్తికాలేదు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు కూడా అదే మాటలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ధిక శాఖ ప్రాజెక్టుల్లో ప్రాధాన్యతలపై దృష్టి పెట్టాలని యోచిస్తోరది. ప్రధానంగా ఎన్ని ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది, వాటిల్లో ఎన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి, వాటికి ఇప్పటివరకు ఎంత నిధులు ఖర్చు చేశారు అన్న వివరాలు తెప్పించుకుని అధ్యయనం చేయాలని నిర్ణయిరచారు.

ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తిచేసేరదుకు ఆర్ధిక శాఖ నుంచి ఆశించిన నిధులు ఇవ్వడం లేదని నీరపారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఇదే విషయాన్ని ఆర్ధిక శాఖ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు వారు చెబుతున్నారు. ప్రస్తుతం పలువురు కాంట్రాక్టర్లకు 500 కోట్ల రూపాయల వరకు చెల్లించాలని అంటున్నారు.

అయితే సక్రమమైన బిల్లులు తమకు వస్తే వాటిని ఆమోదించి నిధులు ఇస్తున్నామని ఆర్ధిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close