పవన్‌తో టచ్‌లోకి వైసీపీలోని మాజీ పీఆర్పీ నేతలు !?

ఏపీలో రాజకీయం వన్ సైడ్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తూండటంతో వైసీపీలో ఉన్న నేతలు తమ పాత పరిచయాల్ని పట్టుకుని టీడీపీలోనో.. జనసేనలోనో చేరేందుకు ముందుగానే ప్రయత్నిస్తున్నారు. వైసీపీలో ఎలాగూ చాన్స్ రాదు. కూటమిలో భాగంగా ఎక్కడైనా చాన్స్ వస్తే అంత కంటే జాక్ పాట్ ఉండదని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో పీఆర్పీలో పని చేసి ప్రస్తుతం వైసీపీలో ఉన్న అనేక మంది నేతలు పవన్ తో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నరు.

తాజాగా వీరిలో ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ పేరు బయటకు వచ్చింది. వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓడిపోయారు. ప్రజారాజ్యంలో పని చేసిన సమయంలోనే పవన్ కల్యాణ్‌తో పరిచయాలు ఉన్నాయి. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో .. ఆ పార్టీ ఉనికి కోల్పోవడంతో చివరికి వైసీపీలో చేరారు. ఆయనకు 2014లో మరోసారి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ అధినేత టిక్కెట్ కేటాయించలేదు.

కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించి మేయర్ ను చేస్తామని బుజ్జగించారు. కార్పొరేటర్ గా పోటీ చేయించారు. కానీ..మేయర్ పదవి కూడా ఇవ్వలేదు. దాంతో ఆయన అసంతృప్తికి గురైనా.. మిన్నకుండిపోయారు.ఆయనను బుజ్గగించడానికి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. ఎమ్మెల్సీ అయినా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడంతో ఆయన మాట వినేవారు లేరు. దీంతో జనసేనలో చేరితే పొత్తులో భాగంగా ఎక్కడైనా సీటు లభించే అవకాశం ఉందని.. ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పవన్ తో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close