బాబు ఒకే అంటే ఇప్పుడే తెదేపాలో చేరిపోతా: గాదె

మాజీ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత గాదె వెంకట రెడ్డి తెదేపాలో చేరేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే బేషరతుగా పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నాను. ఆయన నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి పధంలో ముందుకు సాగుతోంది,” అని అన్నారు.

రాజధాని భూములు బినామీ కొనుగోళ్ళ వ్యవహారంలో వైకాపా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెదేపాకు ఆయన స్వాంతన కలిగించేవిధంగా మాట్లాడారు.”రాజధానిలో కేవలం తెదేపా వాళ్ళు మాత్రమే భూములు కొన్నట్లుగా వైకాపా ఆరోపణలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అక్కడ అన్ని పార్టీలకు చెందిన నేతలు భూములు కొనుగోలు చేసారు. అయినా అందులో తప్పేముంది? రాజధానిలో ముందుగా భూములు కొనిపెట్టుకొని భూములకు కొరత సృష్టిస్తే తప్పు పట్టవచ్చును కానీ తమ అవసరాలకి భూములు కొనుకొంటే అందులో తప్పేమిటి? ఒకవేళ అది తప్పనుకొంటే న్యాయస్థానాలను ఆశ్రయించకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఏదేదో వ్రాయడం వలన ఏమి ప్రయోజనం ఆశిస్తున్నట్లు? ఒకవేళ వారి దగ్గర బలమయిన ఆధారాలున్నట్లయితే సిబీఐ విచారణ వేయమని ప్రభుత్వాన్ని ప్రాదేయపడటం దేనికి? వాటిని న్యాయస్థానానికి చూపిస్తే అదే సిబీఐ విచారణకు ఆదేశిస్తుంది కదా?అని గాదె వెంకట రెడ్డి ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు పొందడానికి గాదె ఆవిధంగా మాట్లాడుతున్నారని అర్ధమవుతూనే ఉంది. అయితే ముఖ్యమంత్రి స్వయంగా ఈ వ్యవహారంపై సిబీఐ విచారణ ఎందుకు అవసరం లేదు అని చెపుతున్నపుడు, తెదేపాలో చేరాలని ఆత్రం పడుతున్న గాదె సిబీఐ విచారణ ఏవిధంగా సాధ్యపడుతుందో వైకాపాకి సూచించడమెందుకో? అయినా 70ఏళ్ల వయసులో రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకోకుండా ఈ వయసులో తెదేపాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఎందుకు అనుకొంటున్నారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close