టీడీపీలోకి హర్ష కుమార్, పనబాక..!

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో పార్టీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. పలువురు ప్రముఖ నేతలు.. వరుస పెట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎంపీ హర్షకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వారు.. మంగళవారం విడివిడిగా చంద్రబాబును కలిశారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అమలాపురం రిజర్వుడు లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. హర్షకుమార్ విషయమై జిల్లాలో ఉన్న సిటింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గ పరిధిలోని ఎంపిక చేసిన అభ్యర్థులనుంచి అభిప్రాయాలు సేకరించి ఆయన అభ్యర్థిత్వంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అమలాపురం లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా చింతా అనూరాధ పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఆమె ఏదో ఒక అసెంబ్లీ స్థానంకోసం పట్టుబడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ చివరకు ఆమె పేరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరారు. ఆయనకు టిక్కెట్ గ్యారంటీ లేకపోవడంతో.. వైసీపీలో చేరారు. ఇప్పుడు అక్కడ కూడా.. తేడాగా ఉండటంతో.. మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. మరో వైపు అమలాపురం పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి అవుతారనుకున్న దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్‌ ను అసెంబ్లీని నిలబెట్టాలని భావిస్తున్నారు. దీనిపైనా కసరత్తు చేస్తున్నారు. మరో వైపు ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కీలక దళిత నేతలు.. పనబాక దంపతులు… తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

వారు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే.. అప్పటికే తిరుపతి లోక్‌సభ టిక్కెట్ ఓ .. పదవి విరమణ చేసిన సివిల్ సర్వీస్ అధికారికి… జగన్ హామీ ఇచ్చారని తెలియడంతో.. వెనక్కి తగ్గారు. నెల్లూరు టీడీపీ నేత సోమిరెడ్డితో సంప్రదింపులు జరపడంతో… వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. టీడీపీ తరపున తిరుపతి ఎంపీ అభ్యర్తిపై ఇప్పటికీ కసరత్తు చేస్తున్నందున.. ఆమె పేరు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో.. సీనియర్ నేతలంతా.. టీడీపీలో చేరుతున్నట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close