హీరోయిన్ మిస్సింగ్ అంటూ పోలీసు కేసు, పబ్లిసిటీ స్టంటా?

మొన్న విడుదలైన రాహు సినిమా హీరోయిన్ కృతి గార్గ్ మిస్సింగ్ అంటూ దర్శకుడు సుబ్బు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం ముంబై నుండి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ పేరుతో ఫోన్ కాల్ వచ్చిందని, బాలీవుడ్ లో అవకాశం గురించి చర్చించడానికి రమ్మని ఫోన్ చేయడంతో హీరోయిన్ ముంబై బయలుదేరి వెళ్లిందని, అయితే ఉదయం నుండి హీరోయిన్ ఫోన్ కలవడం లేదని, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని దర్శకుడు సుబ్బు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇది నిజంగా మిస్సింగ్ కేసా లేకపోతే పబ్లిసిటీ స్టంటా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

గత శుక్రవారం విడుదలైన రాహు సినిమా లో అభిరాం, కృతి గార్గ్ హీరో హీరోయిన్లు గా నటించగా సుబ్బు దర్శకత్వం వహించారు. మరీ గొప్పగా కాకపోయినా సినిమాకు ఒక మోస్తరుగా మంచి రివ్యూస్ వచ్చాయి. అయితే ఓపెనింగ్స్ అంత గొప్పగా లేవు. థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో, ఒత్తిడికి గురైనప్పుడు తాత్కాలికంగా అంధురాలి మారిపోయే పాత్రలో హీరోయిన్ నటించారు. తీసుకున్న పాయింట్లో కాస్త వైవిద్యం ఉన్నప్పటికీ, సమీక్షలు ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవడంతో సినిమా యూనిటే, హీరోయిన్ మిస్సింగ్ అంటూ పబ్లిసిటీ స్టంట్ ఏమైనా చేస్తుందా అన్న అనుమానం ప్రేక్షకుల్లో కలుగుతుంది. దానికి ప్రధాన కారణం, కేవలం ఈరోజు ఉదయం నుండి హీరోయిన్ ఫోన్ రీచ్ అవ్వడం లేదు అంటూ కంప్లైంట్ చేయడం. పైగా కంప్లైంట్ కూడా హీరోయిన్ కుటుంబ సభ్యులు కాకుండా సినిమా దర్శకుడు చేయడం.

మొత్తం మీద హీరోయిన్ మిస్సింగ్ కేసు నిజమా లేక పబ్లిసిటీ స్టంటా, ఒకవేళ పబ్లిసిటీ స్టంట్ అయితే సినిమా యూనిట్ ఆశించిన ఫలితాన్ని ఈ స్టంట్ ఇస్తుందా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close