భవనాల క్రమబద్ధీకరణతో నగరం నాశనం అవుతోంది: హైకోర్టు

తెలంగాణా ప్రభుత్వానికి ఇవ్వాళ్ళ హైకోర్టు మళ్ళీ మొట్టికాయలు వేసింది. జంట నగరాలలో అక్రమ కట్టడాలను రాష్ట్ర ప్రభుత్వం తరచూ క్రమబద్దీకరణ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుండటం వలన, ప్రభుత్వమే ప్రజలను అందుకు ప్రోత్సహిస్తున్నట్లవుతోందని ఆ కారణంగా హైదరాబాద్ జంట నగరాల రూపు రేఖలే పూర్తిగా మారిపోతున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నస్ హైకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్ వేసింది.

దానిని ఈరోజు విచారణకు చేపట్టిన హైకోర్టు, తెలంగాణా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరచుగా అక్రమ భవనాలను క్రమబద్దీకరణ చేసుకొనేందుకు వీలు కల్పిస్తుండటంతో ఒక క్రమబద్దంగా అభివృద్ధి చెందవలసిన నగరం అడ్డదిడ్డంగా పెరిగిపోతోందని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. భవనాలకు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినపుడు, ప్రభుత్వం వాటిని క్రమబద్దీకరించడం ద్వారా ప్రజలకు ఎటువంటి సందేశం పంపిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. అసలు అక్రమంగా నిర్మించిన భవనాలకు ప్రభుత్వం ఏ ప్రాతిపదికన క్రమబద్దీకరించుకొనే అవకాశం కల్పిస్తోంది? దానికి అది అనుసరిస్తున్న విధివిధానాలు ఏమిటని హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంతవరకు జంట నగరాలలో ఎన్ని అక్రమ కట్టడాలను ప్రభుత్వం క్రమబద్దీకరించిందో, ఇంకా ఎన్నిటిని క్రమబద్దీకరించబోతోందో పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను ప్రసన్నం చేసుకొని వారి ఓట్లు పొందడానికి లేకపోతే ఈవిధంగా మునిసిపాలిటీలకు అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి తరచూ క్రమబద్దీకరణ పధకాలను ప్రకటించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు లబ్ది చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్రమబద్దీకరణకు అనుమతిస్తుంటే, దాని వలన సామాన్య ప్రజల కంటే నిర్మాణ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే ఎక్కువ లబ్ది పొందుతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్లాన్ ప్రకారం ఒక అపార్టుమెంటులో ఐదు అంతస్తులకే అనుమతులు తీసుకొని, పైన ఒక పెంట్ హౌస్, పార్కింగ్ కోసం వదిలిపెట్టాల్సిన సెల్లార్ లో ఒకటో రెండో ఫ్లాట్స్ నిర్మించేసి సొమ్ము చేసుకొంటున్నారు. క్రమబద్దీకరణకు అవకాశం వస్తుందనే నమ్మకంతో కొందరు ప్రజలు కూడా ఇష్టం వచ్చినట్లు అక్రమ కట్టడాలు నిర్మించుకొంటున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక కూడా ఊడినట్లు తయారవుతోంది పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close