హైదరాబాద్ మల్టీ నేషనల్ కంపెనీలకు గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల హబ్గా మారుతోంది. పెద్ద ఎత్తున సంస్థలు ఇక్కడ జీసీసీలు ఏర్పాటు చేస్తున్నాయి. గత రెండు నెలల కాలంలోనే పదికిపైగా బడా కంపెనీలు తమ జీసీసీ సెంటర్లను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థ ఆర్సెలాల్ మిట్టర్ , హైదరాబాద్లో GCC ఏర్పాటు చేస్తోంది. ఈ సెంటర్ HR, ఫైనాన్స్, IT వంటి బ్యాకెండ్ ఆపరేషన్లను చూస్తుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎలీ లిల్లీ , హాస్పిటాలిటీ దిగ్గజం మారియట్ ఇంటర్నేషనల్, హెల్త్కేర్ సంస్థ ఎవర్ నార్త్, సైబర్ సెక్యూరిటీ ,సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ప్రసిద్ధి చెందిన బ్లాక్ బెర్రీ, సైబర్ సెక్యూరిటీ రంగంలో పనిచేసే సైబర్ ఆర్క్ ఇప్పటికే హైదరాబాద్లో జీసీసీ ఏర్పాటు చేసింది.
స్టోరబుల్ , అలైన్ టెక్నాలజీ , మొండీ హోల్డింగ్స్ , లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్, ఇన్స్పైర్ బ్రాండ్స్ , ఓమ్నీ డిజైన్ బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ సహా పలు కంపెనీలు తమ జీసీసీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్లోని బలమైన టాలెంట్ పూల్, అధునాతన మౌలిక సదుపాయాలు, తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయక విధానాల కారణంగా GCCలను స్థాపించడానికి లేదా విస్తరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్లోని 355కి పైగా GCCలు 3 లక్షల మందికి పైగా నిపుణులను నియమించాయి. అంటే జీసీసీ హబ్గా హైదరాబాద్ మారిందని అనుకోవచ్చు.