ఐ లవ్ జగన్.. కానీ కుప్పంలో పోటీ చేయను : విశాల్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఐ లవ్ జగన్ అని హీరో విశాల్ రెడ్డి ప్రకటించారు. తన కొత్త సినిమా లాఠీ ప్రమోషన్ లో భాగంగా తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు సినిమా కన్నా ఎక్కువగా రాజకీయ పరమైన ప్రశ్నలే ఎదురయ్యాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం నుంచి విశాల్ పోటీ చేస్తారన్న ప్రచారంపై ఆయనను మీడియా ప్రతినిధులు ఎక్కువగా అడిగారు. అయితే జగన్ అంటే తనకు ఇష్టమని ఎంత డైరక్ట్ గా చెప్పారో.. కుప్పం నుంచి పోటీ చేసేది లేదని.. అసలు ఏపీ రాజకీయాల్లోకి రానని అంతే సూటిగా స్పష్టంగా చేశారు.

కుప్పం నియోజకవర్గంతో తనకు అనుబంధం ఉన్న్ మాట నిజమేనని విశాల్ చెప్పుకొచ్చారు. తన తండ్రి కృష్ణారెడ్డి ఒకప్పుడు కుప్పంలో గ్రానైట్ వ్యాపారం చేసేవారని.. ఆయనకు సహాయంగా తాను కుప్పంలో ఉన్నానన్నారు. కుప్పంలో ప్రతి వీధి తనకు బాగా తెలుసని అన్నారు.. తనకు ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ సంపాదన ,ఎక్కువ ప్రజాభిమానం ఉందని … తనకు ఆ పదవి చిన్నదని స్పష్టం చేశారు. లాఠీ సినిమా ప్రతి టికెట్ ఆదాయంలో ఒక రూపాయి పక్కన పెట్టి రైతులకు సాయం చేస్తానని తెలిపారు. సోషల్ సర్వీస్ చేసే ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడేనని, అలా తాను ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు.

కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి చాలా మందిని వైసీపీ ప్రత్యామ్నాయంగా చూసింది. అందులో విశాల్ ను వైసీపీ హైకమాండ్ మంచి చాయిస్ గా భావించింది. ఆ ప్రకారం ఆయనపై మీడియాలో అనూహ్యంగా ప్రచారం చేయించింది. అయితే విశాల్ మాత్రం అంతే సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించారు. ఆయన ఆసక్తి చూపించి ఉంటే.. ఈ పాటికి కుప్పం అభ్యర్థిగా విశాల్ ఉండేవారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close