తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోను : జగన్

తెలంగాణ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. తెలంగాణలో జల వివాదం ప్రారంభమైన తర్వాత తొలి సారి ఆయన నోరు విప్పారు. అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్ల కేటాయింపులపై గతంలోనే ఒప్పందాలు జరిగాయని.. కేటాయించిన నీళ్లను వాడుకుంటే తప్పేంటని సీఎం జగన్ తెలంగాణ నేతల్ని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కాబట్టి నేరుగా కేసీఆర్‌కే జగన్ ప్రశ్నలు సంధించినట్లుగా అనుకోవచ్చు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని జగన్‌ గుర్తు చేశారు. 881 అడుగులు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు రావని… ఆ స్థాయిలో నీరు ఎంత కాలం ఉందని జగన్ ప్రశఅనించారు.

నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని జగన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాజకీయాల్లో నేనెప్పుడూ వేలు పెట్టలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కార్‌ను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ కారణంగా నీరు సముద్రం పాలవుతోంది. అయినా జగన్.. ప్రధానికి.. కేంద్రమంత్రులుక లేఖలు రాస్తున్నారు కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయలేదు.

కానీ బహిరంగసభలో మాత్రం కేసీఆర్‌కు సందేశం పంపినట్లుగా మాట్లాడారు. ఏపీ కేటాయింపుల నీటికే వాడుకుంటామని.. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పడం ద్వారా ఆయన .. తెలంగాణ పాలకులకు.. ఉన్న అనుమానాలను తీర్చే ప్రయ్తనం చేశారని భావిస్తున్నారు. షర్మిల రాజకీయ పార్టీ.. జగన్ ప్లాన్‌లో భాగం అని నమ్ముతూండటం వల్లే కేసీఆర్ ప్రస్తుతం.. నీటి వివాదం తెచ్చారని జగన్ అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే ఆయన బహిరంగంగా .. కేసీఆర్‌కు అనంతపురం వేదికగా.. తాను తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోనన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close