2019 తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు 85వేలు !

జనసేన పార్టీ పెట్టిన తరవాత తెలంగాణలో పదేళ్లు ఎన్నికలకు దూరంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు కానీ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. ఆ పార్టీ తరపున ఎనిమిది చోట్ల అభ్యర్థులు నిలబడ్డారు. పవన్ కల్యాణ్ తన చేతుల మీదుగా బీఫాం ఇచ్చారు. ఆ ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు సాధించిన ఓట్లు 85వేలు మాత్రమే. అంటే సగటున ఒక్కో నియోజకవర్గంలో పది వేల ఓట్లు కూడా రాలేదు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అంటే..ఒక్కో నియోజకవర్గంలో సగటున పన్నెండు వందల ఓట్లు వచ్చాయనుకోవచ్చు.

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎవరితో పొత్తులు లేకపోయినా 32 స్తానాల్లో పోటీ చేయాలనుకుంది. కానీ బీజేపీ పొత్తులు పెట్టుకుని ఎనిమిది సీట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఎనిమిది సీట్లలో జనసేన పార్టీ ఎంత ప్రభావం చూపిస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలు మరింత లోకలైజ్ అంశాల ప్రాతిపదికగా జరుగుతాయి. బీజేపీ ప్రదాన పార్టీగా ఉంది కాబట్టి… జనసేనకు మేలు జరిగే అవకాశం ఉంది.

కానీ జనసేన పార్టీకి నిర్మాణం లేదు. ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ లేదు. బీజేపీ ఆయా నియోజకవర్గాల్లో ఇచ్చే సహకారంపైనా అనుమానాలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఒక్క కూకట్ పల్లి మాత్రమే ఇవ్వడం… అసలు బీజేపీకి కూడా క్యాడర్ లీడర్ లేని ఖమ్మం వంటి స్థానాలను కేటాయించడంతో జనసైనికులు నిరాశకు గురవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోలానే నిరాశపరిస్తే ఇబ్బంది అవుతుందని … బీజేపీతో పొత్తులో ఉండి కూడా ప్రభావం చూపకపోతే వైసీపీ నేతలు చేసే అసభ్యకామెంట్లు తట్టుకోవడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close