మళ్ళీ పేలిన జేసీ బాంబు

దీపావళి పండుగలో రకరకాల బాంబులు పేలుతుంటాయి. కొన్ని రకాల బాంబులు ఒకసారి అంటిస్తే ఆగాగి మళ్ళీ మళ్ళీ పేలుతుంటాయి. మన రాజకీయానేతల్లో కూడా ఆవిధంగా బాంబులు పేల్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి కూడా ఒకరు. ఆయన పేరుకి తెదేపా నేత అయినా ఎప్పుడు తెదేపాకు చురకలు వేస్తారో ఎప్పుడు తెదేపాను వెనకేసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన ప్రతిపక్షాల మీద కంటే తన స్వంత పార్టీ మీద, తాము భాగస్వామిగా ఉన్న కేంద్రం మీదే ఎక్కువగా విమర్శలు గుప్పిస్తుంటారు.

నిన్న అనంతపురం జిల్లాలో గుంతకల్లులో మీడియాతో మాట్లాడుతూ “కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన తీరు ఇదేవిధంగా సాగుతునట్లయితే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్-అమరావతికి మధ్య తిరగడానికే సరిపోతోంది. అభివృద్ధి పధకాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి ఆచరణలో ఒక్కటీ కనబడటం లేదు. రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కేంద్రం అరకొరగా విదిలించే నిధులతో ఏ పనులు జరగడం లేదు. రాష్ట్రానికి దమ్మిడీ ఆదాయం లేకపోయినా ఖర్చులు మాత్రం చాలా జోరుగానే సాగుతున్నాయి. ఇకనయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనకపోతే భవిష్యత్ అగమ్యగోచరంగా తయారవుతుంది. రాయలసీమ జిల్లాలకు చెందిన కొందరు రాజకీయ నిరుద్యోగులు తమ రాజకీయ మనుగడ కోసమే ప్రజలను రెచ్చగొట్టి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను లేవదీయాలని ప్రయత్నిస్తున్నారు,” అని అన్నారు.

జేసి దివాకర్ రెడ్డి తరచూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం కొత్తేమీ కాకపోయినప్పటికీ ఆయన చేస్తున్న విమర్శలను చంద్రబాబు నాయుడు, రాష్ట్ర బీజేపీ నేతలు గానీ పట్టించుకోకపోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే వేరెవరయినా నేతలు ఈవిధంగా మాట్లాడి ఉండి ఉంటే ఏమయ్యేదో..అందరూ మూకుమ్మడిగా ఏవిధంగా ఆ నేత మీద ఎదురుదాడి చేసి ఉండేవారో అందరికీ తెలుసు. కానీ జేసి దివాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వలన పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదుర్కోవలసివస్తున్నా తెదేపా నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మౌనం వహించడమే విశేషం. అందుకు కారణం ఏమిటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close