బీఆర్ఎస్‌పై లాగుతున్న జేడీ మనసు !

జేడీ లక్ష్మినారాయణ మనసు భారత రాష్ట్ర సమితి వైపు లాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన ఎక్కువగా బీఆర్ఎస్ గురించే ట్వీట్లు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ ను ఇన్వాల్వ్ చేసింది ఆయనే. బిడ్ వేయాలని డిమాండ్ చేశారు.. బిడ్ వేస్తామని ప్రచారం చేసుకున్నప్పుడు అభినందించారు. ఇప్పుడల్లా ప్రైవేటీకరణ లేదని కేంద్రం చెప్పగానే.. బీఆర్ఎస్‌కు క్రెడిట్ ఇస్తూ మొదట సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది కూడా ఆయనే. దీంతో ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా అంచనాకు వస్తున్నారు.

ఏపీలోని ఏ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందడం లేదు. వైసీపీ నుంచి ఆహ్వానం ఉన్నా చేరడానికి ఆయనకు మనసొప్పదు. మనసు చంపుకుని చేరితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూస్తూనే ఉన్నారు. ఇక టీడీపీ కూడా పిలవడం లేదు. ఆయన టీడీపీలో చేరితే జగన్ కేసులపై ప్రభావం పడుతుందని వారు పిలవడం లేదు. ఇక జనసేన పార్టీ నుంచి ఆయన అకారణంగా బయటకు వచ్చారు. అందుకే ఆయనను మళ్లీ పార్టీలోకి రావాలని పవన్ పిలవడం లేదు. జేడీ కూడా అడగడం లేదు. అదే సమయంలో ఏపీలో నేతల కోసం వెదుక్కుంటున్న కేసీఆర్ కు జేడీ కనిపించారు. చర్చలు కూడా జరిగాయని స్వయంగా జేడీ కూడా ప్రకటించారు.

ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో తామే కాపాడేశామని ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్‌కు జేడీ అండగా ఉంటున్నారు కాబట్టి ఆయన ఇక విశాఖ పట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలవడం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడుతోంది. తాము స్టీల్ ప్లాంట్ విజయోత్సవాలను నిర్వహించాలనుకుంటున్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఆ సభలోనే జేడీ బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close