గవర్నర్‌పై కేసీఆర్‌కు ఇంత అభిమానం ఉందా !?

తెలంగాణ గవర్నర్ తమిళిశైపై సీఎం కేసీఆర్‌కు చాలా ఆగ్రహం ఉందని అందరికీ తెలిసిన విషయం. ఆమెను గవర్నర్ గా అవసరమైనప్పుడు మాత్రమే గుర్తిస్తారు. మరే సందర్భంలోనూ ఆమెకు ప్రోటోకాల్ కూడా ఇవ్వరు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓ మంత్రితో గురువారం ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్. ఆ సమయంలో ముఖాముఖి కేసీఆర్ చర్చలు జరిపారు. వాళ్లేం చర్చించారో అన్న సంగతి రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే అలా చర్చించుకున్న ఒక్క రోజులోనే గవర్నర్ ను సచివాలయానికి ఆహ్వనించారు.

సచివాలయంలో నూతనంగా నిర్మించిన ఆలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. గవర్నర్ రావడానికి ముందే సచివాలయం గేటు వద్దకు వెళ్లి నిలబడ్డారు. తాను స్వయంగా ఆమెను ఆహ్వానించారు. ఆలయంలో పూజలు పూర్తయ్యాక.. సచివాలయంలోని సీఎంవో అధికారులు .. తన చాంబర్ ఉండే ఆరో అంతస్తుకు స్వయంగా తీసుకెళ్లారు. సచివాలయం మొత్తాన్ని చూపించారు. అసలు ఇక్కడ కొసమెరుపేమిటంటే ఇదే సచివాలయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న గవర్నర్ ను కేసీఆర్ ఆహ్వానించలేదు. పైగా రాలేదంటూ మంత్రులు విమర్శలు గుప్పించారు. కానీ పిలవనే లేదని గవర్నర్ మండిపడటంతో.. అంతా సైలెంట్ అయ్యారు.

కేసీఆర్ ఇప్పుడు గవర్నర్ తో ఇంత సఖ్యతగా ఎందుకు ఉంటున్నారన్నది బీఆర్ఎస్ వర్గాలకూ అంతు చిక్కడం లేదు. కేబినెట్ ఆమోదించిన రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అలాగే ఆర్టీసీ విలీనం బిల్లుకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. వాటి కోసమే కేసీఆర్ సఖ్యతగా ఉంటున్నారని.. ఆ సంతకాలు అయిపోయిన తర్వాత మళ్లీ కామన్ గానే వివాదాలుంటాయని.. బీఆర్ఎస్ లోనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close