ముందస్తుపై కేటీఆర్ వ్యతిరేకత !

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారన్న చర్చ కొంత కాలంగా నడుస్తోంది. రాజకీయంగా కేసీఆర్ ఒక్క సారిగా యాక్టివ్ కావడంతో ప్రజలకు ప్రతిపక్షాలకు ఇదే సందేహం వస్తోంది. ఏ రాజకీయ వ్యూహం లేకుండా ఆయన ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ స్టెప్ వేయరని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై మోడీ వ్యాఖ్యల తర్వాత టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించిందీ.. నేతలు, మంత్రులు కమలదళంపై విమర్శలు గుప్పించిందీ.. రాష్ట్ర ప్రజల్లో మరోసారి సెంటిమెంట్‌ను రగిలింపజేయడానికే.

వచ్చే జూన్ తర్వాత ఏ రోజైనా శాసనసభను రద్దు చేసే అవకాశముందని ఇప్పటికీ అందరూ నమ్ముతున్నారు. నవంబర్‌, డిసెంబర్‌లో గుజరాత్ తదితర రాష్ట్రాలతోనో లేదంటే 2023 ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటక తదితర రాష్ట్రాలతోనో ఎన్నికలు జరుగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఒకవేళ మోడీ సర్కారు సహకరించిన పక్షంలో ఈ ఏడాది జూన్-ఆగస్టు మధ్య ఒక్క తెలంగాణ కోసమే ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదన్న అంచనాలు ఉన్నాయి.

టీఆర్ఎస్ సర్కార్‌పై వ్యతిరేకత బహిరంగంగానే కనిపిస్తోంది. దీన్ని అధిగమించాలంటే భావోద్వేగ అంశాన్ని అందుకుని ఎన్నికలకు వెళ్లాలి. అయితే ఈ ముందస్తు ఆలోచనలపై కేటీఆర్ సుముఖంగా లేరని టీఆర్ఎస్‌లోనే మరో వర్గం బలంగా వాదిస్తోంది. ఏడాది సమయం ఉండి కూడా తప్పుడు అంచనాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, అధికారం కోల్పోతే పరువు పోతుందనే అభిప్రాయంతో కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్‌ను సీఎం చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేటీఆర్ వర్గం కోరుకుంటోంది. ఐదు రాష్ట్రాలఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కేసీఆర్ తన ముందస్తు నిర్ణయంపై ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close