“ల్యాండ్ పూలింగ్‌”ను కల్పవృక్షంలా భావిస్తున్న తెలుగు ప్రభుత్వాలు..!

చంద్రబాబునాయుడు రాజధాని అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ అనే విధానం తీసుకు వచ్చే వరకూ.. అందరికీ తెలిసిన ఒకే ఒక్క విధానం.. భూసేకరణ. ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో ప్రజాప్రయోజనాల కోసం అంటూ భూముల్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ అది. కానీ రాజధాని కోసం పెద్ద ఎత్తున భూములు అవసరం కాబట్టి.. రాజధానితో పాటు భూములు ఇచ్చిన వారు కూడా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. దానిపై ఎవరెన్ని విమర్శలు చేసినా అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల్ని సైతం అబ్బురపరిచింది. ఇప్పుడు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా.. ఆ ల్యాండ్ పూలిం‌ంగ్ విధానం అద్భుతమని అనుకుంటున్నాయి. ఆ పద్దతిలోనే ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాయి.

తెలంగాణ కేబినెట్ భేటీలో ల్యాండ్ పూలింగ్ విధానంపై చర్చ జరిగింది. తెలంగాణలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం, ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రత్యేకంగా లేఅవుట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన విధి విధానాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం.. ఏపీ సర్కార్ కూడా దాదాపుగా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. శివారు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించి.. లే ఔట్లు వేసి… మధ్య.తరగతి ప్రజలకు తక్కువ కు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రెండు ప్రభుత్వాలు పూలింగ్ కోసం ఉత్సాహపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.

ల్యాండ్ పూలింగ్ పద్దతిలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు.. కొత్త ప్రభుత్వం చేతిలో తంటాలు పడుతున్నారు. ఏ ప్రాజెక్టు కోసం అయితే భూమి ఇచ్చారో ఇప్పుడా ప్రాజెక్ట్ ను ప్రస్తుత ప్రభుత్వం తరలించేస్తోంది. అలాంటప్పుడు ఆ భూమికి విలువ ఎలా వస్తుందో.. వారికి తెలియడం లేదు. అందుకే ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసింది కాబట్టి.. తాము పట్టించుకోబోమని.. తర్వాత వచ్చే ప్రభుత్వాలు అనుకుంటే రైతులే మునిగిపోతారు. దేనికైనా ప్రభుత్వాలపై విశ్వాసమే మొదటి పెట్టుబడి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close