రాజ‌మౌళి చెబుతాన‌న్న గ్రేట్ న్యూస్ ఇదే : మ్యూజియంలో ప్ర‌భాస్‌

ఈనెల 5వ తారీఖున ప్ర‌భాస్ అభిమానుల‌కు ఓ అద్భుత‌మైన విష‌యం చెబుతా అంటూ బాహుబ‌లి 2 ప్రెస్ మీట్‌లో ఊరించాడు రాజ‌మౌళి. ఆ విష‌యం ఏమిటా అన్న ఉత్సుక‌త నెల‌కొంది. ప్ర‌భాస్ హాలీవుడ్ వెళ్తున్నాడ‌ని, అదే ఆ అదిరిపోయే న్యూస్ అనుకొన్నారు అభిమానులు. 5వ తారీఖున అంటూ ముందుగానే స్వీట్ న్యూస్ క‌న్‌ఫామ్ చేశాడు జ‌క్క‌న్న‌. బాహుబ‌లి ప్ర‌భాస్ హాలీవుడ్ వెళ్ల‌డం లేదుగానీ, అందుకు స‌రితూగే ఘ‌న‌తే ద‌క్కించుకోనున్నాడు. బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్ర‌భాస్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టింప‌చేయ‌నున్నారు. మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించిన చోటే.. ప్ర‌భాస్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌బోవ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే. ఈ ఘ‌న‌త వ‌హించిన తొలి భార‌తీయ న‌టుడు ప్ర‌భాసే. రాజ‌మౌళి చెబుతాన‌న్న స్వీటెస్ట్ న్యూస్ కూడా ఇదే. మ్యూజియంకి సంబంధించిన స్టాట్యూ డిజైన‌ర్స్ వ‌చ్చి ప్ర‌భాస్ మెజ‌ర్‌మెంట్స్‌ని తీసుకెళ్లారు. అతి త్వ‌ర‌లో బ్యాంకాక్ మ్యూజియంలో ప్ర‌భాస్ నిలువెత్తు విగ్ర‌హాన్ని చూడొచ్చ‌న్న‌మాట‌. హాలీవుడ్ సినిమా, అవార్డు, పెళ్లి సంగ‌తి అంటూ.. ఏవేవో ఊహించుకొన్న ప్ర‌భాస్ అభిమానుల‌కు ఈ వార్త అంత కిక్ ఇవ్వక‌పోయినా బ్యాంకాక్ మ్యూజియం విశిష్ట‌త తెలిసిన‌వాళ్ల‌కు నిజంగా ఇది గ్రేట్ న్యూసే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close