న్యాయ వ్యవస్థపై రక్షణమంత్రి విమర్శలు!

న్యాయ వ్యవస్థపై రక్షణమంత్రి మనోహర్ పార్రికర్ తీవ్ర విమర్శలు చేశారు. డీజిల్ వాహనాల వలన వాయు కాలుష్యం పెరుగుతుందంటూ వాటిపై నిషేధం విధించడం అర్ధరహితం. దాని వలన మెర్సిడీస్ కంపెనీ దేశంలో పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయించుకొంది. కాలుష్యానికి కారణమవుతున్న డీజిల్ వాహనాలను నిషేధించవచ్చు కానీ ఆ సాకుతో అన్ని డీజిల్ వాహనాలను నిషేధం విధించాలనుకోవడం అర్ధ రహితం. అసలు డీజిల్ వాహనాలన్నిటినీ నిషేధించాలనే న్యాయస్థానం అభిప్రాయం వెనుక తర్కం అర్ధం చేసుకోలేకపోతున్నాను. సైన్స్ గురించి తెలియని వాళ్ళు దాని గురించి మాట్లాడటం సరికాదు,” అని అన్నారు.

దేశరాజధాని డిల్లీలో విపరీతంగా కాలుష్యం పెరిగిపోతోందని కేజ్రీవాల్ ప్రభుత్వం సరిబేసి నెంబర్ల వాహనాల విధానాన్ని కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూశారు. దాని వలన డిల్లీ ప్రజలు చాలా ఇబ్బందులు పడినప్పటికీ, అది ఒక మంచి ఉద్దేశ్యంతో చేస్తున్న ప్రయత్నమ గనుక అందరూ సహకరించారు. దాని వలన ఆశించిన స్థాయిలో వాయు కాలుష్యం తగ్గకపోయినా, రోజూ కొన్ని వేల వాహనాలు రోడ్ల మీదకి రాకుండా అడ్డుకోవడం వలన ఎంతో కొంత కాలుష్యం తగ్గే ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ డీజిల్ వాహనాల వలననే వాయు కాలుష్యం ఏర్పడుతోందనే ఉద్దేశ్యంతో సుప్రీం కోర్టు డిల్లీలో డీజిల్ వాహనాలు తిరగడాన్ని నిషేధం విధించడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. ఎందుకంటే ప్రజా రవాణా, సరుకు రవాణా వ్యవస్థలలో ఉపయోగించే వాహనాలలో అధిక శాతం డీజిల్ నే ఇంధనంగా ఉపయోగిస్తుంటాయి. కనుక డిల్లీలో కేవలం పెట్రోల్ వాహనాలకే అనుమతిస్తామంటే అన్ని వర్గాల వారికీ ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. అందుకే మనోహర్ పార్రికర్ స్పందించవలసి వచ్చింది. వాయు కాలుష్యం సమస్య కేవలం డిల్లీలోనే కాక దేశంలో అన్ని నగరాలు, పట్టణాలలో కూడా నానాటికీ పెరిగిపోతోంది. దానికి డీజిల్ వాహనాలే కారణం అని నిషేధిస్తే పరిస్తులు ఏవిధంగా తయారవుతాయో ఊహించవచ్చు. అన్ని రకాల కాలుష్యాలని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా కాలుష్య నియంత్రణ మండలి శాఖలున్నాయి. అవి కాలుష్య నివారణకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వగల అర్హత, అధికారం కలిగి ఉన్నాయి. వాటిని పాటించనివారిపై కటిన చర్యలు తీసుకొనే అధికారం కూడా కలిగి ఉన్నాయి. కానీ వాటిపని అవి సక్రమంగా చేయకపోవడం వలననే దేశంలో నానాటికీ ఈ కాలుష్య సమస్య తీవ్రమవుతోంది. అవి పనిచేయక పోవడం వలననే న్యాయవ్యవస్థలు జోక్యం చేసుకోవలసి వస్తోంది. న్యాయ వ్యవస్థపై ప్రభుత్వ ప్రతినిధులు విమర్శలు చేయవలసి వస్తోంది. కనీసం ఇప్పటికైనా కాలుష్య నివారణ మండలి మేల్కొని తగిన విధంగా స్పందిస్తే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close