రేవంత్ వేరు కుంపటి!

టీడీపీ వేరు, తెలంగాణ టీడీపీ వేరా? ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం వింటే ఇదే అనుమానం కలుగుతుంది. పెద్ద నోట్ల రద్దు, పర్యవసానాలపై ఆయన ప్రసంగించిన తీరు విచిత్రంగా ఉంది. పార్టీ విధానంతో నిమిత్తం లేకుండా వేరు కుంపటి పెట్టారా అని కొందరు విమర్శలుకూడా చేశారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్, నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలను మళ్లించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే క్యాష్ లెస్ సేవల కోసం ఏపీ పర్స్ మొబైల్ యాప్ ను ప్రారంభించారు. డిజిటల్ దిశగా దేశాన్ని నడపడానికి సూచనలు చేయాల్సిన ముఖ్యమంత్రుల కమిటీకి ఆయనే కన్వీనర్.

రేవంత్ రెడ్డి మాత్రం డిజిటల్, నగదు రహిత విధానం అసాధ్యం అన్నట్టు మాట్లాడారు. కరెంటు సదుపాయం లేని గ్రామాల్లో స్వైపింగ్ మిషన్లను ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. కుగ్రామాల్లో స్వైపింగ్ చెల్లింపులు చేస్తారని ఎవరు చెప్పారు? డబ్బు ఇవ్వాల్సిన చోట డబ్బే ఇవ్వాలి. పైగా తెలంగాణలో విద్యుత్ సదుపాయం లేని గ్రామాలు చాలా తక్కువ. అక్కడ కూడా ఆన్ లైన్ చెల్లింపులే అని ఎవరైనా అంటారా?

తెలంగాణలో డిజిటల్ చెల్లింపులు చేయాలంటే 10 లక్షల స్వైపింగ్ మిషన్లు కావాలన్నారు, వాటిని ప్రభుత్వమే ఉఛితంగా సరఫరా చేయాలని రేవంత్ చెప్పారు. నగదు రహితమంటే కేవలం స్వైపింగ్ మిషన్లే కాదు. సెల్ ఫోన్ ద్వారా కూడా చెల్లింపు చేయవచ్చు. పైగా స్వైపింగ్ మిషన్లు ప్రభుత్వం ఇచ్చేవి కావు. అవి ఇవ్వాల్సింది బ్యాంకులు. ఈ అవగాహన కూడా ఆయనకు లేదా అనే అనుమానం కలుగుతుంది.

ప్రసంగం ప్రారంభంలోనే ఓ పేద్ద తప్పిదాన్ని ఆయన పట్టుకున్నారు! పెద్ద నోట్ల రద్దుపై చర్చ అని ముఖ్యమంత్రి ప్రసంగ పాఠంపై ఉంది. అది తప్పు అన్నారు. నోట్ల ఉపసంహరణ మాత్రమే జరిగింది. పాత నోట్లను డిపాజిట్ చేసి కొత్తవి తీసుకొమ్మని కేంద్రం ప్రకటించిందన్నారు. సరే, 500 నోట్ల విషయంలో అదే నిజం. మరి 1000 రూపాయల నోట్లు? అవి రద్దయ్యాయికదా. మొత్తానికి తన ప్రసంగంలో చాలా భాగం తమ పార్టీ అధినేత వైఖరికి భిన్నంగా మాట్లాడటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close