తెలంగాణాలో రైతులు, ఏపీలో విద్యార్ధినులు ఆత్మహత్యలు

వైకాపా ఒక సైకో పార్టీ అని తెలుగు దేశం నేతలు ఎద్దేవా చేస్తుంటే, శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు తెదేపాలో జిల్లాకో సైకో సూదిగాడు తయారయ్యాడని వైకాపా ఎమ్మెల్యే రోజా ఘాటుగా బదులిచ్చారు. అందుకు ఆమె మంచి థియరీ కూడా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆడపిల్లలు లేనందునే ఆయనకి మహిళల విలువ ఏమిటో తెలియడం లేదని, అందుకే ఆ పార్టీలో సైకో సూదిగాళ్ళు తెగ రెచ్చిపోతున్నారని విమర్శించారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం కటినంగా వ్యవహరించి ఉండి ఉంటే భానుప్రీతి అనే విద్యార్ధిని ఆత్మహత్యను నివారించగలిగి ఉండేవాళ్ళం కదా? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు, మహిళా అధికారులు, మహిళా ప్రజా ప్రతినిధులు,విద్యార్దునులకు భద్రత కరువయిందని రోజా ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై నానాటికీ దౌర్జన్యాలు, విద్యార్ధినుల ఆత్మహత్యలు పెరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చీమ కుట్టినట్లు కూడా లేదని, మంది మార్బలాన్ని వెంటేసుకొని హాయిగా విదేశీయాత్రలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వంలో మహిళా మంత్రులయినా కనీసం ఈ సమస్యపై స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

అధికార ప్రతిపక్ష పార్టీల వాదోపవాదనలు పక్కనబెట్టి ఆలోచిస్తే రాష్ట్రంలో మహిళల పరిస్థితిపై రోజా చెప్పిన మాటల వాస్తవం ఉందని అంగీకరించక తప్పదు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు పెరిగాయి. తహసిల్దార్ వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అతనిని వెనకేసుకు రావడంతో పార్టీ నేతలకి, ప్రజలకి కూడా తప్పుడు సంకేతాలు పంపినట్లయింది.

తల్లి తండ్రులు లక్షలు చెల్లించి కార్పోరేట్ కాలేజీలలో తమ ఆడపిల్లలను చేర్చితే వారు చదువులు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయిప్పుడు. ర్యాగింగ్ భూతానికి ఎప్పుడు ఎవరు బలయిపోతారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు తల్లి తండ్రులు ఆడపిల్లలను కార్పోరేట్ కాలేజీలకు పంపేందుకు పంపడానికి కూడా ఇష్టపడకపోవచ్చును.

ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకొన్నప్పుడు, ‘రాష్ట్రంలో ఏ కాలేజీలోకూడా విద్యార్ధులు ర్యాగింగ్ పేరు ఎత్తేందుకు కూడా భయపడే విధంగా కటినమయిన చట్టాలు తెస్తామని’ మంత్రి గంటా శ్రీనివాస రావు హామీ ఇచ్చారు. కానీ నేటికీ రాష్ట్రంలో విద్యార్ధినుల ఆత్మహత్యలు ఆగకపోవడం గమనిస్తే ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని స్పష్టం అవుతోంది. రోజా చేసిన విమర్శలను అధికార పార్టీ రాజకీయకోణంలో చూడకుండా ఒక సద్విమర్శగా స్వీకరించి తక్షణమే తగు చర్యలు చేపడితే మంచిది. లేకుంటే తెలంగాణాలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నట్లే, ఆంధ్రాలో మహిళలు, విద్యార్ధినులు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి.అది ఎవరికీ మంచిది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close