మైసూరా రెడ్డి కూడా అవుట్!

వైకాపా సీనియర్ నేత ఎం.వి.మైసూరా రెడ్డి ఇవ్వాళ్ళ పార్టీ వీడే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. మరికొద్ది సేపటిలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చాలా సీనియర్ అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనను అసలు పట్టించుకోవడం లేదని, పార్టీలో తనను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే బాధతో మైసూరా రెడ్డి చాలా కాలంగా పార్టీకి, దాని కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య ఒకసారి పార్టీని వీడి రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభిద్దామని కూడా ఆలోచించారు కానీ మళ్ళీ ఎందుకో వెనకడుగు వేశారు. అప్పటి నుంచి ఆయన ఏదో ఒకరోజు వైకాపాని వీడటం ఖాయం అనే సంకేతాలు స్పష్టంగా ఇస్తూనే ఉన్నారు కానీ వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. అది ఆయనకి ఇంకా ఆగ్రహం కలిగించి ఉండవచ్చు. అందుకే కొన్ని రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై తనను వైకాపా సభ్యుడిగా సంబోధించవద్దని కోరారు. ఇన్నాళ్ళుగా నిర్ణయం తీసుకోవడానికి ఆయన వెనుకాడినా చివరికి ఇవ్వాళ్ళ పార్టీని వీడేందుకు సిద్దం అవుతున్నట్లున్నారు. అయితే ఆయన వైకాపాని వీడి తెదేపాలో చేరబోతున్నారా లేక కొంత కాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారా అనే విషయం మరికొద్ది సేపటిలో తెలియవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close