మైత్రీకి చిక్కిన ‘న‌క్కిన‌’

ధ‌మాకాతో త‌న ఖాతాలో మ‌రో హిట్టు వేసుకొన్నాడు న‌క్కిన త్రినాథ‌రావు. తొలి రోజు యావ‌రేజ్ టాక్ తో మొద‌లైనా.. మెల్ల‌గా ‘ధ‌మాకా’ హిట్ సినిమాగా ట‌ర్న్ తీసుకోవ‌డం న‌క్కిన అదృష్టమే. ధ‌మాకా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ట‌వ్వ‌డంతో… ఈ ద‌ర్శ‌కుడిపై హీరోలు, నిర్మాత‌లు దృష్టి సారించారు. తాజాగా మైత్రీ మూవీస్ సంస్థ న‌క్కిన చేతిలో అడ్వాన్స్ కూడా పెట్టిన‌ట్టు టాక్‌. న‌క్కిన త‌దుప‌రి సినిమా మైత్రీలోనే ఉండే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. వెంక‌టేష్ తో ఓ సినిమా చేయాల‌ని న‌క్కిన ఎప్ప‌టి నుంచో స్కెచ్ వేస్తున్నాడు. వెంకీ కోసం కొన్ని క‌థ‌లు కూడా సిద్ధం చేశాడు. కానీ ఎందువ‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌ర్కవుట్ అవ్వ‌లేదు. ‘ధ‌మాకా’ హిట్ట‌వ్వ‌డం.. మైత్రీ మూవీస్ న‌క్కిన తో సినిమా చేయ‌డానికి ముందుకు రావ‌డం… న‌క్కిన త్రినాథ‌రావుకి క‌లిసొచ్చే అంశాలు. చేతిలో మైత్రీ ఉంది కాబ‌ట్టి.. వెంకీ కూడా ప్రొసీడ్ అయ్యే ఛాన్సుంది. ఇది వ‌రకే న‌క్కిన త్రినాథ‌రావు వెంకీకి క‌థ వినిపించేశాడు. ఇక కాల్ తీసుకోవాల్సింది వెంకీనే. ఇటీవ‌ల ‘హిట్‌’ ద‌ర్శ‌కుడు శైలేష్ క‌థ‌కు ప‌చ్చ‌జెండా ఊపాడు వెంకీ. ఇప్పుడు న‌క్కిన ప్రాజెక్టు కూడా దాదాపుగా ఖాయ‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close