‘దేవ‌దాస్‌’కి మరో ఛాన్స్ ఇచ్చిన ‘నోటా’

గ‌త వారం విడుద‌లైన ‘దేవ‌దాస్‌’ ఏవ‌రేజ్ టాక్‌తో స‌రిపెట్టుకుంది. తొలి వారాంతం వ‌సూళ్లు బాగానే ఉన్నా… సోమ‌వారం నుంచి క‌ల‌క్ష‌న్లు డ్రాప్ అయ్యాయి. ఈవారం ‘నోటా’ ఉంది కాబ‌ట్టి ‘దేవ‌దాస్’ ప‌ని ఖ‌తం అనుకున్నారంతా. కానీ ‘నోటా’ తొలి ఆట‌తోనే ‘ఫ్లాప్‌’ టాక్‌మూట‌గ‌ట్టుకుంది. తొలిరోజు కాబ‌ట్టి వ‌సూళ్ల‌కి ఢోకా ఉండ‌దు. మౌత్ టాక్ స్పైడ్ అయితే శ‌ని, ఆదివారాల్లో జోరు త‌గ్గిపోతుంది. దాన్ని క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డింది ‘దేవ‌దాస్‌’. ఎప్పుడైతే ‘నోటా’ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసిందో అప్పుడే ‘దేవ‌దాస్‌’ టీమ్ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ వీకెండ్ ఎలాగైనా ప్రేక్ష‌కుల దృష్టిని త‌మ సినిమావైపుకు తిప్పుకోవాల‌ని భావిస్తోంది. అందుకే స‌డ‌న్‌గా ఈరోజు సాయింత్రం ఓ ప్రెస్‌మీట్ నిర్వ‌హించేసింది ‘నాగార్జున మీడియాతో మాట్లాడ‌తారు..` అనేస‌రికి అదేదో ‘మ‌రీ ముఖ్య‌మైన విష‌యం’ అనుకుని భ్ర‌మ‌ప‌డిన పాత్రికేయుల‌కు ‘దేవ‌దాస్‌’ ప్రెస్ మీట్ అనేస‌రికి తెల్ల‌మొహాలేసేశారు. ‘నోటా’ ఎలాగూ కుటుంబ ప్రేక్ష‌కుల‌తో చూసే సినిమా కాదు. దానికి తోడు ఫ్లాప్ టక్ వ‌చ్చింది కాబ‌ట్టి ‘మా సినిమా మీరు మ‌రో ఆప్ష‌న్‌’ అంటూ… చెప్పుకునే ఛాన్స్ వ‌చ్చింది. ‘ఈ వీకెండ్ మీ పిల్ల‌ల‌తో క‌ల‌సి మా సినిమా చూడండి. త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు’ అని నాగార్జున మ‌రోసారి మైకు ప‌ట్టుకుని ఆహ్వానించేశారు. మొత్తానికి.. ఈ వీకెండ్ ‘దేవ‌దాస్కి’ కాస్త చోటు దొరికింది. అయితే… దాన్ని ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close