మణిరత్నం ఆఫర్ తిరస్కరించిన నందమూరి బ్రహ్మణి

హైదరాబాద్: సుప్రసిద్ధ తమిళ దర్శకుడు మణిరత్నం నందమూరి బాలకృష్ణ కుమార్తె, చంద్రబాబు నాయుడు కోడలు అయిన బ్రహ్మణికి గతంలో సినిమా ఛాన్స్ ఆఫర్ చేశారట. బాలకృష్ణ స్వయంగా ఈ విషయాన్ని ఇవాళ ఒక తెలుగు దినపత్రిక ఇంటర్వ్యూలో చెప్పారు. కుమార్తెలు రాజకీయాలలోకి వస్తానంటే ప్రోత్సహిస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ, తప్పకుండా ప్రోత్సహిస్తానని బాలయ్య అన్నారు. తన పెద్ద కుమార్తె బ్రహ్మణికి ఒకప్పుడు మణిరత్నం దర్శకత్వంలో సినిమా అవకాశం వచ్చిందని తెలిపారు. తనను ఈ మాట అడగటానికి కూడా సుహాసిని భయపడిందని చెప్పారు. తాను అప్పుడు బ్రహ్మణితో, “అమ్మా, నీకు మణిరత్నం డైరెక్షన్‌లో సినిమా ఛాన్స్ వచ్చింది. నువ్వు నటిస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని చెప్పినట్లు తెలిపారు. అయితే బ్రహ్మణి తనకు ఆసక్తి లేదని చెప్పటంతో తాను ఊరుకున్నట్లు బాలయ్య వెల్లడించారు.

ఉదయం 3.30 గంటలకే లేస్తానని, చుట్ట తాగటంతో తన దినచర్య మొదలవుతుందని బాలకృష్ణ చెప్పారు. డైటింగ్ లాంటివి అస్సలు చేయనని, కార్డియో, సైక్లింగ్ ఎక్సర్ సైజులు బాగా చేస్తానని తెలిపారు. ఇతర హీరోల సినిమాలు అస్సలు చూడనని చెప్పారు. వినోదానికైనా, విజ్ఞానానికైనా తన తండ్రిగారి సినిమాలే చూస్తానని తెలిపారు. రాజకీయాలలో ఏ పదవీ ఆశించనని చెప్పారు. చంద్రబాబు సమర్థవంతంగా పాలిస్తున్నారని, ప్రజలు మరో పదేళ్ళు ఆయనే సీఎంగా ఉండాలనుకుంటున్నారని చెప్పారు. వందో సినిమా గురించి మరో వారం రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ సినిమా నిర్ణయమైన తర్వాతే తన కుమారుడు మోక్షజ్ఞ సినిమా గురించి ఆలోచిస్తామని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close