కడప గడపలో జగన్, లోకేష్

రాజకీయ ప్రత్యర్దులయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరూ ప్రస్తుతం కడప జిల్లాలో మకాం వేసి ఉన్నారు. చిత్రమేమిటంటే ఇద్దరు కూడా వైకాపా కోసమే వచ్చేరు. వారిలో లోకేష్ వైకాపాని ఖాళీ చేయాలని వస్తే, జగన్మోహన్ రెడ్డి అతని బారి నుండి తన పార్టీ నుండి కాపాడుకోవాలని వచ్చేరు. వారి ఈ వ్యవహారం పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా ఉంది.

నారా లోకేష్ మొదటి ప్రయత్నంలో వైకాపాకు చెందిన కడప మునిసిపల్ కార్పోరేటర్లను తెదేపాలోకి రప్పించే ఆలోచనతో వచ్చినట్లు కనిపెట్టగానే జగన్మోహన్ రెడ్డి వారితో సమావేశమయ్యి ప్రలోభాలకు, బెదిరింపులకి లొంగవద్దని, తనతో కలిసి మరో రెండేళ్ళు పనిచేస్తే అధికారం మనదేనని అప్పుడు అందరి ‘రుణం’ తీర్చుకొంటానని హామీ ఇచ్చారు. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలతో కూడా అయన సమావేశమయ్యి వారికీ అదే మాట చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఘోర పరాభవం పొందిన తరువాత నారా లోకేష్ ఈ ‘మిషన్ ఆకర్ష’ కోసం కడప వచ్చేరు. కానీ జగన్ అప్రమత్తత కారణంగా జిల్లా నుండి ఎవరినీ పార్టీలోకి రప్పించలేకపోయినట్లయితే మళ్ళీ అవమానం తప్పదు. హైదరాబాద్ కె.టి.ఆర్. చేతిలో పరాభవం పొందిన లోకేష్ మళ్ళీ ఇప్పుడు కడపలో జగన్మోహన్ రెడ్డి చేతిలోనూ పరాభవం పొందినట్లు అవుతుంది. అది అయన రాజకీయ భవిష్యత్ కి ఏమాత్రం మంచిది కాదు. వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి కడపలోనే ఉన్నప్పటికీ జగన్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు కనుక ఆయన పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఆయననయినా తెదేపాలో చేర్పించలేకపోతే లోకేష్ పరువు నిలబడదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close