ఇలా భ‌య‌పెట్టేస్తే ఎలా.. నారా రోహిత్?

ఇది వ‌ర‌కు యేడాదికి రెండు మూడు సినిమాలైనా వ‌ద‌లేవాడు నారా రోహిత్‌. ఆ సినిమా హిట్టు ఫ్లాపుల‌తో అస్స‌లు సంబంధ‌మే లేకుండా, త‌న‌కు అవ‌కాశాలు వ‌చ్చేవి. కొన్ని క‌థ‌లు, కొన్ని పాత్ర‌లు.. ప్రేక్ష‌కుల‌కూ న‌చ్చేవి. సోలోని మిన‌హాయిస్తే – త‌న సినిమాలు ఆర్థిక విజ‌యాల్ని అందుకున్న దాఖ‌లాలు లేవు. అయినా స‌రే.. ఆ స్పీడు త‌గ్గ‌లేదు. అయితే కొంత‌కాలంగా నారా రోహిత్ ఖాళీ. వ‌రుస ఫ్లాపుల వ‌ల్లో, సినిమాల‌పై అస‌క్తి త‌గ్గ‌డం వ‌ల్లో తెలీదు గానీ, ఈమ‌ధ్య ఒక్క సినిమా కూడా ప‌ట్టాలెక్కించ‌లేదు. స‌రి క‌దా… సెట్స్‌పైకెళ్లిన సినిమాలు సైతం ఆగిపోయాయి.

ఇక నారా రోహిత్ ప‌ని అయిపోయింద‌ని అంతా ఫిక్స‌యిపోయారు. కావ‌ల్సిన హీరోలు దొర‌క్క‌, రోహిత్‌ని వెదుక్కుంటూ వెళ్తే… ‘నా ద‌గ్గ‌రే క‌థ ఉంది..’ అంటూ నిర్మాత‌ల్నీ, ద‌ర్శ‌కుల్నీ ఊరిస్తున్నాడ‌ట‌. అంతే కాదు.. ‘ఈ సినిమాకి 15 కోట్ల బ‌డ్జెట్ అవుతుంది.. అలాగైతేనే సినిమా చేద్దాం’ అంటున్నాడ‌ట‌. ఇప్ప‌ట్లో రోహిత్ తో సినిమా చేయ‌డ‌మే గ‌గ‌నం. అది స‌రిపోద‌న్న‌ట్టు… ఇంతింత బ‌డ్జెట్లు పెట్టాలంటే మాట‌లా..? అందుకే రోహిత్ ని వెదుక్కుంటూ వెళ్తున్న ఆ ఒక‌రిద్ద‌రు కూడా బ‌డ్జెట్లు చూసి భ‌య‌ప‌డి వ‌చ్చేస్తున్నార్ట‌. అలాగైతే… రోహిత్ మ‌రో సినిమా చేయ‌డం క‌ష్ట‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close