డేట్‌ డిసైడైంది…తలారీ దొరకడంలేదట…!

ఢిల్లీ నిర్భయ ఘటనలో నలుగురు దోషులను ఉరి తీయడానికి తేదీ ఖరారైంది. వినయ్‌ శర్మ, పవన్‌ కుమార్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ అనే నలుగురు దోషులను ఈ నెల 16 వ తేదీన ఉదయం 5 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయడానికి జైలు అధికారులు నిర్ణయించారు. వినయ్‌ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరి శిక్ష అమలుకు అధికారులు తేదీ ఖరారు చేశారు. తాను క్షమాభిక్ష పిటిషన్‌ పంపలేదని, దాని మీద తన సంతకం లేదని వినయ్‌ శర్మ చెప్పాడు. ఇది నిజమా, కాదా అనేది పక్కన పెడితే
ఉరిశిక్ష అమలుకు తేదీ ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

2012 డిసెంబరు 16 నిర్భయ ఘటన జరగ్గా కేసులో ప్రధాన నిందితుడైన రామ్‌ సింగ్‌ కేసు విచారణ జరుగుతున్న దశలోనే 2013 మార్చి 14న జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఐదుగురిలో ఒకడు నేరం జరిగిన సమయానికి మైనర్‌ కావడంతో జువైనల్‌ హోమ్‌కు తరలించారు. అక్కడ మూడేళ్ల శిక్ష పూర్తయిన తరువాత 2015 డిసెంబరు 20న విడుదలయ్యాడు. మిగిలిన నలుగురికి విచారణ తరువాత ఉరిశిక్ష పడింది. ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ఉరిశిక్షను సమర్ధించాయి.

ఏడేళ్లకు వీరి శిక్ష అమలుకు ముహూర్తం ఖరారైంది. ఉరి శిక్ష అమలుకు తేదీ ఖరారైందనే వార్త ఉరి శిక్షను సమర్థించేవారికి సంతోషం కలిగిస్తున్నా వారిని ఉరి తీయడానికి తీహార్‌ జైలులో తలారీ లేడని, తలారీ కోసం వెదుకుతున్నామని జైలు అధికారులు చెప్పారు.

నిర్భయ దోషులను ఉరి తీస్తామంటూ ఇద్దరు ముందుకు వచ్చారు. వారిలో ఒకాయన హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు చెందిన రవి కుమార్‌. మరొకాయన తమిళనాడుకు చెందిన సుభాష్‌ శ్రీనివాసన్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌.

హైదరాబాదులో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో శిక్షను త్వరగా అమలు చేయడానికి కేంద్ర ప్రభత్వం చర్యలు తీసుకుంది. దిశ ఘటనపై ప్రజల్లో ఎంతటి ఆగ్రహావేశాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయో చూశాం. దిశను హత్య చేసినవారికి ఉరిశిక్షే విధించాలని సామాన్యులతోపాటు పార్లమెంటు సభ్యులు, పాలకులు, ప్రముఖులు కోరారు. ఈలోగా నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. 2012 నాటి నిర్భయ కేసులో దోషులకు ఇప్పటివరకు మరణశిక్ష అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. న్యాయ వ్యవస్థ మీదనే నమ్మకం పోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వేగంగా కదులుతోంది.

నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం తనకు ఇవ్వాలని హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు చెందిన రవి కుమార్‌ అనే తలారి ప్రభుత్వాన్ని కోరాడు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌కు ఈమధ్య లేఖ రాశాడు. మన దేశంలో అత్యంత అరుదైన కేసుల్లో, తీవ్రాతి తీవ్రమైన కేసుల్లో మాత్రమే దోషులకు మరణశిక్ష అమలు చేస్తారు. ఎప్పుడో కొన్నేళ్లకు ఓసారి మరణశిక్ష అమలు జరుగుతుంది. కాబట్టి పర్మినెంటు తలారులు (ఉరి తీసేవారు) ఉండరు. అధికారులు వీరిని వెతికి పట్టుకురావల్సి ఉంటుంది.

పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్‌గురును తీహార్‌ జైల్లో ఉరితీశారు. అక్కడ అమలు జరిగిన చివరి మరణ శిక్ష ఇదే. ఆ తరువాత నిర్భయ కేసు దోషుల మరణ శిక్షను అమలు చేయాల్సివుంది. ఈ నేపథ్యంలో ‘నేను ఉరితీస్తా’ అంటూ రవి కుమార్‌ మందుకు వచ్చాడు. ఇదిలా ఉండగా, తమిళనాడుకు చెందిన సుభాష్‌ శ్రీనివాసన్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ కూడా నిర్భయ దోషులను తాను ఉరి తీస్తానని తీహార్‌ జైలు అధికారులకు లేఖ రాశాడు. ఇతను రామనాథపురం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్నాడు. ‘దోషులను త్వరగా శిక్షించడానికి వీలుగా నేను ఈ పని చేయడానికి సుముఖంగా ఉన్నాను’ అని అతను లేఖలో పేర్కొన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close