వరస్ట్ స్టేట్‌గా పరోక్షంగా ఏపీ గురించి నిర్మల కామెంట్స్ !

”ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఉద్యోగులంతా నిరసనలు చేస్తున్నారు. సదరు ప్రభుత్వం భారీ ప్రకటనలకు డబ్బులు ఖర్చు చేస్తోంది. మీకు ఆదాయం ఉంటే ఉచితాలు ఇవ్వొచ్చు. కానీ అప్పులు చేసి ఇవ్వడం కాదు” ఈ మాటలు వింటే ఎవరికైనా గుర్తు వచ్చేది ఏపీ ప్రభుత్వమే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతోంది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు..భారీగా ప్రకటనలకూ ఖర్చులు చేస్తోంది. అప్పులు చేసి మరీ ఉచితాలకు పంచి పెడుతోంది. అందుకే అందరూ నిర్మలా సీతారామన్ అన్నది ఏపీనేనని తేల్చారు.

నిజానికి నిర్మలా సీతారామన్ ఈ అంశాన్ని చెప్పాల్సిన పని లేదు. సభలో వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై స్పందించారు. కానీ ప్రత్యేకంగా ఏపీని గుర్తు చేసేలా.. చెబుతూ..అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పడం మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరించింది. ఏపీలో ఆదాయం పెరగకపోగా.. ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి. కట్టాల్సిన వడ్డీ భారం పెరిగిపోతోంది. ఓడీల మీదనే ప్రభుత్వం ఆధారపడుతోంది.

కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితిని ఆరు నెలల్లో పూర్తి చేస్తున్న ప్రభుత్వం.. కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా రుణాలు చేస్తోంది. వీటికి సంబంధించిన వివరాలు ఆర్బీఐకి పంపడం లేదు. దీంతో కొన్ని అదనపు రుణాలకు అనుమతి పొందుతున్నారు. కేంద్రానికి బ్యాంకుల నుంచి ప్రత్యేకంగా నివేదికలు అందుతున్నా.. వేల కోట్లు రుణాలిస్తున్నారని తెలుస్తున్నా.. నిరోధించడం లేదు. తమకు మద్దతుగా ఉంటున్న వైసీపీకి వారు మద్దతుగా ఉంటున్నారు. కానీ ఏపీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని చెప్పకనే చెబుతున్నారు. అంటే ఏపీ అలా అయిపోవడానికి వారి కూడా భాగం ఉందన్నట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close