రేషన్ సాయం పంపిణీకి వాలంటీర్లు ముందుకు రాలేదా..?

కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించినందున పేదలకు సాయం చేయాడానికి ఏపీ సర్కార్ ఐదు కేజీల బియ్యం, కేజీ పప్పు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు.. మంత్రి పేర్ని నాని కూడా… సాయాన్ని ఇంటికే తీసుకొచ్చి ఇస్తారని ప్రకటించారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి గొప్పగా చెప్పి.. అద్భుతంగా పని చేస్తుందని కితాబులు అదే పనిగా ఇస్తున్నారు కాబట్టి… వాలంటీర్లతోనే.. ఆ సాయాన్ని లబ్దిదారులకు పంపిణీ చేస్తారని అనుకున్నారు. పథకాలన్నీ డోర్ డెలివరీ చేయడం అనేది వైసీపీ సర్కార్ కాన్సెప్ట్. ఇప్పటికే ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉన్నారు. అది మాత్రమే కాదు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల్ని బయటకు రావాలని కోరడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే.. అసలు లాక్ డౌన్ ప్రకటించిందే.. ప్రజలెవరూ బయటకు రాకుండా ఉండటానికి. కానీ లాక్ డౌన్ సాయం పొందడానికి లబ్దిదారులంతా.. రేషన్ దుకాణాల వద్దకు రావాలని సమాచారం పంపారు.

నిత్యావసర వస్తువుల కోసమే…కర్ఫ్యూ రిలీఫ్‌ను ఉదయం పదకొండు గంటల వరకే పరిమితం చేసిన ప్రభుత్వం రేషన్ దుకాణాలకు మాత్రం ఒంటి గంట వరకూ చాన్సిచ్చింది. ప్రస్తుతం ఎండాల కాలం ప్రారంభమయింది. ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో.. పేదలందర్నీ సాయం తీసుకోవడానికి.. రేషన్ దుకాణాల వద్దకు పిలిపించి.. గంటల తరబడి వెయిట్ చేస్తున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ.. వివిధ రకాల భద్రతా ప్రమాణాలు పాటించాల్సి వస్తూండటంతో..రేషన్ పంపిణీ ఆలస్యమవుతోంది. తొలి రోజు..ఏ రేషన్ దుకాణం వద్ద చూసినా పెద్ద ఎత్తున లబ్దిదారులు గుంపులు,గుంపులుగా ఉన్నారు. కరోనా భయం కారణంగా ఐదుగురు కన్నా ఎక్కువ మంది గుమికూడవద్దని.. ప్రభుత్వమేచెబుతూ.. చివరికి.. ప్రభుత్వమే ఇలా గుంపులుగా గుడికూడేలా చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఐదు కేజీల బియ్యం, కేజీ పప్పు మాత్రమే ఉచితంగా ఇస్తున్నారు. మిగతా సరుకులన్నింటినీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో హుదూద్ వచ్చినప్పుడు.. చంద్రబాబు.. మొత్తం పది సరుకులతో రేషన్ ను ఉచితంగా పంపిణి చేశారు. వైట్ కార్డు ఉందా లేదా అన్నది కూడా చూడలేదు. ఇప్పుడు..దాంతో పోల్చి చూస్తూ.. లబ్దిదారులు అసంతృప్తికి గురవుతున్నారు. తమను బలవంతంగా ఖాళీగా కూర్చోబెట్టి.. కనీస సాయం కూడా చేయడం లేదని అసంతృప్తికి గురవుతున్నారు. ఇంతా చేసి.. రూ.వెయ్యి సాయం చేస్తామన్న ప్రభుత్వం.. దాన్ని వచ్చే నెల నాలుగో తేదీ ఇస్తామని చెప్పింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close