నేడు శకపురుషునికి అద్భుత నీరాజనం !

హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నారు. ‘ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ’ ఆధ్వర్యంలో కైతలాపూర్‌ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకలకు ప్రముఖులంతా తరలి రానున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వస్తారు. ఎన్టీఆర్ కుటంబసభ్యులతో పాటు ఊహించని సినీ స్టార్లు అందరూ తరలి రాబోతున్నారని చెబతున్నారు. ‘గెస్ట్స్‌ ఆఫ్‌ ఆనర్‌’గా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ , సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా , సీపీఎం జాతీయ సెక్రటరీ శ్రీ సీతారామ్‌ ఏచూరితో పలువురు రాజకీయ నేతలు పాల్గొంటారు.

ఇక పవన్ కల్యాణ్, శివరాజ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారంతా హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా ఒకే వేదిక కనిపిస్తే అదో సంచలనం అవుతతుంది. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సావనీర్‌, వెబ్‌సైట్‌ల ఆవిష్కరణలతోపాట పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పలువురు ప్రముఖులకు కమిటి పురస్కారాలు అందిస్తుంది. ఎన్టీఆర్‌ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ అవిష్కరిస్తారు.

టీడీ జనార్ధన్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ వేడుకలకు .. ఆయన స్వయగా అందరి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. కీలక నేతలు అందరూ రావడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అందుకే వారి పేరున హైదరాబాద్‌లో స్వాగతాలు కూడా ఏర్పాటు చేశారని అంటున్నారు. ప్రకటనల్లో పేర్కొన్నట్లుగా హీరోలు అందరూ ముఖ్యంగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అందరూ ఒకే వేదికపై కనిపిస్తే.. సినీ ఫ్యాన్స్ కు అంతకంటే కన్నుల పండువ మరొకటి ఉండదు. అందుకే ఈ వేడుకపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close