కాంగ్రెస్ టికెట్ ఉంటే… పాలేరులో గెలిచినట్టే..!

మండే ఎండల కాలంలో రాజకీయ వేడి రాజుకుంది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక సెగ అన్ని పార్టీలనూ ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. తనకు కలగా మిగిలిన పాలేరు సీటు కైవసం అనేది నిజం చేసుకోవాలని ప్రస్తుత తెరాస మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం రాంరెడ్డి దామోదర్ రెడ్డి భార్యనే నిలబెట్టాలని నిర్ణయించింది.

పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ఖమ్మం జిల్లాలోపాలేరులో మాత్రం హస్తం పార్టీదే హవా. 1972 నుంచి ఇప్పటి వరకు పాలేరులో ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరిగాయి. హస్తం పార్టీ తన సత్తాను చాటుతూ ఏకంతా 7 సార్లువిజయం సాధించింది. సీపీఎం రెండుసార్లు, సీపీఐ ఒకసారి గెలుపొందాయి. పాలేరు నుంచి ఎక్కువ సార్లు విజయం సాధించిన అభ్యర్థి సంభాని చంద్రశేఖర్. ఆయన కాంగ్రెస్ తరఫున మూడుసార్లు విజయబావుటా ఎగురవేశారు. ఇటీవల మరణించిన దామోదర్ రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో నెగ్గారు.

తెలుగు దేశం పార్టీకి అందని ద్రాక్షగా మారిన వాటిటో పాలేరు విజయం ఒకటి. ఎంత ప్రయత్నించినా ఇది సాధ్యం కాలేదు. అలాగే, తుమ్మల సైతం పాలేరు సీటును కైవసం చేసుకోవడానికి ప్రయత్నించారు. పాలేరు టికెట్ కోసం తమ పార్టీలోనే అంతర్గత పోటీని కూడా ఎదుర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ ఓడినా, కేసీఆర్ పుణ్యమా అని గులాబీ తీర్థం పుచ్చుకుని మంత్రి అయ్యారు. ఇప్పుడు పాలేరులో గెలిచి సత్తా చాటడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం కారు జోరుకు తిరుగులేకుండా పోయింది.

ఎక్కడ ఎన్నికలు జరిగినా తెరాస జైత్రయాత్రకు డోకాలేదని కేసీఆర్ బృందం దీమాతో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఖమ్మం కార్పొషన్ దాకా అంతటా గులాబీ జెండా రెపరెపలే. కాబట్టి పాలేరులోనూ పాగా వేయడం నల్లేరు మీద నడకంటున్నారు గులాబీ లీడర్లు. కాంగ్రెస్ కంచుకోటగా పేరు పొందిన పాలేరులో ఒకప్పుడు కాంగ్రెస్ టికెట్ చేతిలో ఉంటే గెలిచినట్టే భావించే వారు. దామోదర్ మరణంతో కొంత సానుభూతి ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. అయినా తెరాస హామీలు, ఇతరత్రా అంశాల ప్రభావాన్ని తట్టుకోవడం సాధ్యమా అనే అనుమానాలున్నాయి. ఈసారి ఈ సీటుకోసం గట్టిగా ప్రయత్నించాలని తెలుగు దేశం కూడా భావిస్తోంది. అయితే, ఎవరు గెలిచినా పరవాలేదు గానీ సైకిల్ ను తొక్కెయ్యాలనేది తెరాస పంతం. కాబట్టి, అంతిమంగా కారు గెలుపు గమ్యాన్ని చేరుతుందో లేక మరో విధంగా ఫలితం వెల్లడవుతుందో వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close