పవన్ కాల్షీట్స్: అమరావతికి ఒక్క రోజే.. “కర్నూలు”కు రెండు రోజులు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలు అంతుబట్టకుండా పోతున్నాయి. అమరావతి రైతుల కోసం.. ఉవ్వెత్తున ఎగిసిన పోరాటం.. ఒక్క సారిగా.. బీజేపీతో పొత్తు తర్వాత చల్లబడిపోయింది. రెండు పార్టీలు కలిసి అమరావతి కోసం..  ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతామని.. గొప్పగా ప్రకటించాయి. కానీ తర్వాత చడీచప్పుడూ లేకుండా పోయాయి. బీజేపీ ట్రాప్‌లో పవన్ కల్యాణ్ పడిపోయారని…అందరూ అనుకుంటున్న సమయంలో..  పవన్ కల్యాణ్ తాను సొంతంగా అమరావతి పోరాటాన్ని కొనసాగించబోతున్నట్లు సూచనలు ఇచ్చారు. అందులో భాగంగా.. పదిహేనో తేదీన ఆయన అమరావతిలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కానీ.. అంతకు ముందే. మరో పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారు. కర్నూలులో రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

అయితే.. పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన రాజధానికి సంబంధించినది కాదు. సుగాలి ప్రీతి అనే విద్యార్థిని కేసుకు సంబంధించిన అంశంలో ఆయన పోరాటం ప్రారంభిస్తున్నారు. 2017లో కర్నూలులో ఓ కాలేజీలో ఈ విద్యార్థిని మృతి చెందింది. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరుగుతోంది. సుగాలి ప్రీతిని అత్యంత దారుణంగా కొంత మంది రాజకీయనేతల అనుచరులే అత్యాచారం చేసి  హత్య చేశారన్న అభిప్రాయానికి జనసేనానికి వచ్చారు. వారి కుటుంబానికి న్యాయం  చేయాలని… పోరాడుతున్నారు. గతంలోనూ.. ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ హఠాత్తుగా.. అమరావతి అంశం హాట్ టాపిక్ అవుతున్న సమయంలో.. పవన్ కల్యాణ్.. మళ్లీ ఈ అంశాన్ని  హైలెట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్న విషయం.

పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన… రాజధాని ఉద్యమకారుల్లో కొత్త అనుమానాలకు తావిస్తోంది. పవన్ కల్యాణ్ ఓ అంశంపై… ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నప్పుడు.. అ అంశం కోసమే… తన పార్టీకి సంబంధించి కీలకమైన పొత్తుల్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు… దాని గురించి పట్టించుకోకుండా.. ఇతర అంశాన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేయడం… తెలివైన రాజకీయం కాదంటున్నారు. ముందుగా అమరావతి రైతులకు మద్దతుగా తాను చేయాలనుకున్నది చేయాలని.. కానీ.. వారి  ఉద్యమాన్ని డైవర్ట్ చేసేలా.. ఇతర వ్యవహారాల్ని హైలెట్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. పవన్ కల్యాణ్ కు రాజకీయ సలహాలు ఎవరు ఇస్తున్నారో కానీ… తప్పటడుగులు వేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి బీజేపీతో పొత్తు తర్వాత రాజధాని రైతులకు మద్దతుగా పవన్ పోరాటం తేలిపోయిందనే అభిప్రాయం మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

HOT NEWS

css.php
[X] Close
[X] Close