జగన్ రెడ్డి సిల్లీ కక్షలు – ఏపీ పోలీసులకు తిప్పలు !

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా… ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపే ఎన్నారై యశస్వి బొద్దులూరి తన తల్లిని పరామర్శించడానికి ఇండియాకు రాగానే ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వస్తున్నారని తెలుసుకుని ప్రత్యేకంగా కాన్వాయ్ వేసుకుని హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే అదుపులోకి తీసుకున్నారు.

యశ్ బొద్దులూరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారంతే. లండన్ లో ఉండే ఆయన తన స్వరాష్ట్రంలో అరాచకపాలనను. అడ్డగోలు విధానాలు.. పేదలను పీడించుకునే ప్రభుత్వ పెద్దల నిర్వాకాన్ని గట్టిగా ప్రశ్నిస్తారు. అందుకే కోపం పెంచుకున్నారు. ఆయనపై ఎప్పుడు కేసులు పెట్టారో ఎవరికీ తెలియదు. ఎన్ని సార్లు కోర్టుల్లో చివాట్లు పడినా… పోలీసులు మాత్రం మారరు. ప్రభుత్వ పెద్దలు పెట్టుకుని సిల్లీ కక్షలను అమలు చేయడానికి వారు రంగంలోకి దిగాల్సింది. అదే జరిగింది.

మనకు రాజ్యాంగం.. వాక్ స్వేచ్చను ఇచ్చింది. దీన్ని వైసీపీ వాళ్లకు మాత్రమే పరిమితం చేసి.. వాళ్లు మాత్రం అందర్నీ అడ్డగోలు బూతులు తిట్టొచ్చు.. తమను మాత్రం ఎవరైనా చిన్న మాట అంటే… ప్రభుత్వంపై కుట్ర.. వర్గాల చిచ్చు.. అంటూ రకరకాల సెక్షన్ల కింద కేసులు పెట్టేస్తారు. ఈ రకమైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు చేసినా ప్రయత్నాలను కోర్టులు ఎన్నో సార్లు కొట్టేశాయి. పోలీసుల సిగ్గుపోయింది. చివరికి కార్టూనిస్టునే కాదు.. సోషల్ మీడియా పోస్టుల్ని షేర్ చేసిన వారినీ వదల్లేదు. అయినా వారందర్నీ అరెస్టు చేసి..కోర్టు దాకా తీసుకెళ్లగలరు..కానీ అక్కడ షాక్ మాత్రం పోలీసులకే.

ఎలాగోలా అదుపులోకి తీసుకున్నామని చెప్పడానికి తప్ప.. పోలీసులు ఇందులో నేరం ఏమిటో నిరూపించలేరు. కానీ…. సిక్ మైండ్ తో ఉన్న ప్రభుత్వ పెద్దల సిల్లీ కక్షలకు పోలీసులు ఇలా టార్చర్ పడాల్సిందే. యశ్ బొద్దులూరికి మద్దతు టీడీపీ మొత్తం కదిలింది. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close