రాజకీయం రివర్స్..! ఆ అటవీ అధికారిపై అట్రాసిటీ కేసు..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిర్పూర్ కాగజ్ నగర్‌లో అటవీ అధికారిపై దాడి వ్యవహారంలో పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దాడికి గురైన అటవీ అధికారిపై నేరుగా అట్రాసిటీ కేసు పెట్టారు. దీంతో.. మరో సారి.. ఈ విషయం హైలెట్ అయింది. ఎఫ్ఆర్ఓ అనితతో పాటు మరో పదిహేను మంది ఫారెస్ట్ అధికారులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కులం పేరుతో దూషించి.. గిరిజనుల పై దాడి చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేయగానే.. కేసు పెట్టేశారు. పది రోజుల కిందట సార్సాలలో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. అడ్డుకున్నందుకుగాను అనితతోపాటు అటవీసిబ్బందిపై కర్రలు, రాళ్లతో గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ఎమ్మెల్యే కోనేరు సోదరుడు కృష్ణారావుతో పాటు 15 మందిపై కేసు కూడా నమోదు చేశారు.

అటవీ అధికారులపై దాడి ఘటన ఘటన పార్లమెంట్‌లోనూ ప్రస్తావనకు వచ్చింది. కేంద్రమంత్రులు కూడా తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలను సహించబోమని ప్రకటించారు. సొంత పార్టీకి చెందిన నేత కావడంతో.. టీఆర్ఎస్.. ఈ వివాదం నుంచి.. వారిని బయట పడేసేందుకు ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ అటవీ అధికారిక అనిత… ఆ తర్వాత కూడా.. తన ప్రాణానికి ముప్పు ఉందని.. సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గతంలోనూ ఇలాగే వ్యవహరించారని చెబుతూ.. ఆయనపై కచ్చితంగా చర్యలు తీసుకోవలాని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో.. ఇప్పుడు ఆమెపైనే నేరుగా.. ఎస్సీ, ఎస్టీ కేనును నమోదు చేశారు.

అటవీ అధికారులు. విధుల నిర్వహణ కోసమే అక్కడికి వెళ్లారు. ఇలా కేసులు పెడితే.. ఇక తాము.. ఎలా అడవుల్ని కాపాడగలమని.. అటవీ అధికారులు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నోరెత్తలేని పరిస్థితికి వెళ్లాయి. అనితపై దాడి జరిగిన తర్వాత.. ఏ ఉద్యోగ సంఘమూ కూడా… పెద్దగా స్పందించిన దాఖలాల్లేవు. ఈ కారణంగానే… ఎస్సీ, ఎస్టీకేసు పెట్టగలిగారని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో.. ఉద్యోగులందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన సంఘాలు.. ఇప్పుడు… తమకు అన్యాయం జరుగుతున్నా.. పట్టించుకోలేకపోతున్నాయి. దానికి సాక్ష్యం.. ఎఫ్‌ఆర్వో అనిత కేసే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close