ప్రధానితో భీమవరానికి రఘురామ.. ఇప్పుడు అడ్డుకోగలరా ?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈ సారి ఏ భయం లేకుండా ఆయన పర్యటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సారి ఆయన నేరుగా ప్రధానమంత్రితో పాటు పాల్గొనబోతున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోదీ వస్తున్నారు. నియోజకవర్గ ఎంపీగా ఆయన కూడా పాల్గొనాల్సి ఉంది. దీంతో జూలై రెండో తేదీన ఆయన నియోజవకర్గానికి వస్తారు. ఇప్పుడు ఆయనను అడ్డుకోవడానికి అరెస్ట్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు రెండున్నరేళ్లుగా పార్లమెంటరీ నియోజకవర్గం నర్సాపురంలో అడుగు పెట్టలేకపోతున్నారు. ఆయన అడుగు పెడితే.. ఏదో ఓ కేసు పెట్టించి అరెస్ట్ చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. గతంలో ఆయన ఓ సారి అలా పర్యటన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు .. అప్పుడు నర్సాపురం మొత్తం అనేక కేసులు నమోదు చేశారు. అందులో అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. కోర్టుకెళ్లి ఎలాగోలా ఆ కేసుల నుంచి బయటపడినా… రకరకాల కేసుల్లో అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారన్న అనుమానంతో ఆయన నర్సాపురం వైపు వెళ్లడం లేదు.

తమ పార్టీ తరపున గెలిచి తమను ధిక్కరించారన్న ఆగ్రహంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆయనపై రకరకాల కేసులు పెడుతున్నారు. జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని.. నియోజకవర్గంలో అడుగుపెట్టనీయవద్దని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంమలో ఈ సారి ప్రధానితో పాటే ఆయనా పాల్గొననున్నారు ., మరి ఇందులో సీఎం జగన్ కూడా పాల్గొంటారా లేదా అన్నది స్పష్టత లేదు. ఒకే వేదికపై జగన్.. మోదీ.. రఘురామ కూడా ఉంటే.. రాజకీయ వర్గాల్లో ఉండే కిక్ వేరుగా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close