నర్సాపురం ఎంపీ ప్రాణాలకు ముప్పు..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సొంత పార్టీతో ఏర్పడిన విబేధాలు.. మరో రేంజ్‌కు వెళ్తున్నాయి. ఆయన తన ప్రాణానికి ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని..నేరుగా తన పర్సనల్ సెక్రటరీ ద్వారా ఎస్పీకే ఫిర్యాదు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖను ఎస్పీకి పంపి.. దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఎంపీకే రక్షణ లేని పరిస్థితులు ఎందుకు వచ్చాయి… ఎవరి వల్ల ప్రాణాలకు ముప్పు ఉందో.. ఆ వివరాలన్నింటినీ లేఖలో.. పేర్కొన్నారు. వైసీపీ అధినాయకత్వంతో ఏర్పడిన విబేధాల కారణంగా.. ఆయనను ఇతర వైసీపీ నేతలు.. తమకు మాత్రమే సాధ్యమయ్యే “ట్రేడ్ మార్క్” విమర్శలు చేస్తున్నారు. అందులో దిష్టిబొమ్మలు తగుల బెట్టడం దగ్గర్నుంచి జిల్లాలో ఎలా తిరుగుతారో చూస్తారనే హెచ్చరికల వరకూ ఉన్నాయి.

తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యానారాయణను హఠాత్తుగా వైసీపీ అనుకూల మీడియా ఇంటర్యూలు చేస్తోంది. అందులో తీవ్రమైన హెచ్చరికలు ఉంటున్నాయి. వైసీపీ నేతలకు.. ఎవరిపై ..ఎప్పుడు.. ఏం మాట్లాడాలో.. ఎలాంటి చర్యలకు పాల్పడాలో.. పై నుంచి స్పష్టమైన దిశానిర్దేశం వస్తుందన్న ప్రచారం ఉంది. ఈ విషయం బాగా తెలుసేమో కానీ.. తనపై దాడులు జరుగుతాయని.. రఘురామకృష్ణం రాజు అనుమానిస్తున్నారు. అందుకే.. సొంత పార్టీ నేతల వల్లనే తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కావాలని లేఖ పంపారు. తన దిష్టిబొమ్మలు తగులబెట్టి.. అసభ్యకరంగా మాట్లాడుతున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులపై ఉండి, ఆచంట, ఆకివీడు, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా… ఎవరూ పట్టించుకోలేదని ఎంపీ తన సెక్రటరీ ద్వారా పంపిన లేఖలో.. పేర్కొన్నారు.

నియోజకవర్గంలో తిరగాలంటే రక్షణ కల్పించాలని కోరారు. వైసీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణంరాజు.. అదే పార్టీ కార్యకర్తలు… నేతల వద్ద నుంచి ప్రాణహాని ఉందనే ఆరోపణలు చేయడం వరకూ.. రాజకీయం మారింది. ఇది అంతకంతకూ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. వైసీపీ అగ్రనేతలు.. ఎప్పటికప్పుడు రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తున్నారు కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి

దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి...

గాజు గ్లాస్ గుర్తుపై కూటమికి పాక్షిక రిలీఫ్

జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులకు, అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని...

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

HOT NEWS

css.php
[X] Close
[X] Close