ప్ర‌భాస్ మ‌ల్టీప్లెక్స్.. చ‌ర‌ణ్ చేతుల మీదుగా

ప్ర‌భాస్ సొంత సంస్థ‌ యూవీ క్రియేష‌న్స్ సూలూరు పేట‌లో ఓ మ‌ల్టీప్లెక్స్‌ని నిర్మించింది. దానికి వీ – ఎపిక్ అనే పేరు పెట్టారు. ఈనెల 29న ఈ మ‌ల్టీప్లెక్స్‌ని ప్రారంభించ‌నున్నారు. 30 నుంచి ఈ థియేట‌ర్లో సాహో ప్ర‌ద‌ర్శిస్తారు. ఈ థియేట‌ర్ రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా లాంచ్ కానున్న‌ద‌ని స‌మాచారం. 29న రామ్‌చ‌ర‌ణ్ హెలీకాఫ్ట‌ర్ పై సూలూరు పేట వెళ్ల‌నున్నార‌ని, చ‌ర‌ణ్ ఈ మ‌ల్టీప్లెక్స్‌కి రిబ్బ‌న్ క‌టింగ్ చేయ‌నున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. అత్యాధునిక టెక్నాల‌జీతో రూపొందిన ఈ మ‌ల్టీప్లెక్స్ దాదాపు 60 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. ఈ మ‌ల్టీప్లెక్స్‌లో మొత్తం మూడు స్క్రీన్‌లున్నాయి. స్క్రీన్ 1, స్క్రీన్ 2 లు 375 సిట్టింగ్ కెపాసిటీతో నిర్మించారు. స్క్రీన్ 3 మాత్రం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంది. దీని సిట్టింగ్ కెపాసిటీ 750. స్క్రీన్ ఎత్తు దాదాపు 100 అడుగులు. ఇండియాలో అత్యంత పెద్ద స్క్రీన్ ఇదే. ఈ మ‌ల్టీప్లెక్స్‌కి ఇంటిరీయ‌ర్, ఎక్స్‌టీరిజ‌య్ డిజైనింగ్ ప్ర‌ముఖ క‌ళా ద‌ర్శ‌కుడు ఎస్ ర‌వీంద‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగాయి. ఈగ‌, మ‌గ‌ధీర లాంటి చిత్రాల‌కు క‌ళా ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారాయ‌న‌. యూవీ క్రియేష‌న్స్‌తో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉంది. దాంతో ఈ థియేట‌ర్ బాధ్య‌త‌ని ఆయ‌న‌కే అప్ప‌గించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close