వడ్డించేవాడు మన వాడయితే

వడ్డించేవాడు మన వాడయితే పంక్తిలో ఏ మూల కూర్చొన్నా పరువలేదన్నట్లు, ప్రధాని నరేంద్ర మోడియే స్వయంగా హాజరయ్యే సాంస్కృతిక కార్యక్రమానికి అనుమతులకు కరువేమిటి? ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్-రవిశంకర్ ఈరోజు నుండి డిల్లీ సమీపంలో యమునా తీరాన్న నిర్వహించబోతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల గురించి.

భారత్ తో సహా వివిధ దేశాలకు చెందిన సుమారు 35 లక్షల మంది ఈ సాంస్కృతిక ఉత్సవాలకి హాజరవవచ్చని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు. అందుకు వీలుగా యమునా నది ఒడ్డున సుమారు 150 ఎకరాలలో విస్తీర్ణంలో బారీ వేదికలు వగైరా ఏర్పాటు చేయబడుతున్నాయి. దాని కోసం ప్రభుత్వం అవసరమయిన అన్ని అనుమతులు మంజూరు చేసింది కూడా.

అయితే అక్కడ సుమారు 50-75 ఎకరాలలో రైతులు పంటలు సాగు చేసుకొంటున్నారు. వాటన్నిటినీ ఈ ఉత్సవ నిర్వాహకులు పొక్లెన్లు పెట్టి ద్వంసం చేసారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే లక్షలాది మందికి అవసరమయిన సౌకర్యాలు కల్పించేందుకు ఆ ప్రాంతం అంతా పూర్తిగా చదునుచేసి దాని రూపురేఖలు పూర్తిగా మార్చివేశారు. రైతుల, పర్యావరణ ప్రేమికుల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఉత్సవాల నిర్వహణకు బారీ ఏర్పాట్లు చేసుకొన్నారు.

దానిపై కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుని ఆశ్రయించగా, దాని చైర్మెన్ స్వతంత్ర కుమార్ ఈ సమయంలో ఉత్సవాలను అడ్డుకొనే శక్తి తమకు లేదని నిస్సాహయతను వ్యక్తం చేసింది. కానీ యమునా తీరంలో పర్యావరణానికి నష్టం కలిగించినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు రూ. 5కోట్లు జరిమానా విధించి, దానిని శుక్రవారంలోగా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ చెల్లించకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని తన నోటీస్ లో పేర్కొంది.

దానిపై రవిశంకర్ స్పందిస్తూ “మేము ఏ తప్పు చేయలేదు. కనుక గ్రీన్ ట్రిబ్యునల్ కి విధించిన జరిమానాను చెల్లించదలచుకోలేదు. అవసరమయితే జైలుకయినా వెళతాను కానీ ఒక్క పైసా కూడా చెల్లించే ప్రసక్తే లేదు,” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
దీనిపై భారతీయ కిసాన్ మజ్దూర్ సమితి అనే స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తే, ఆఖరు నిమిషంలో వచ్చి పిర్యాదు చేస్తే ఎలాగ? ప్రచారం కోసమే కదా పిటిషన్ వేసింది?” అని ప్రశ్నించి ఆ పిటిషన్ న్ని తిరస్కరించింది. అందుకే వడ్డించేవాడు మన వాడయితే పంక్తిలో ఏ మూల కూర్చొన్నా పరువలేదననే మాట నిజమని నమ్మవలసి వస్తోంది.

ఈ వివాదాలను చూసి ఈ ఉత్సవాలకు హాజరు కాకూడదని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జింబాబ్వే రాష్ట్రపతి రాబార్ట్ ముగాబే నిర్ణయించుకొన్నారు. ప్రధాని నరేంద్ర మోడి, ఇతర కేంద్రమంత్రులు, దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. భాజపా, దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారని వేరేగా చెప్పనవసరం లేదు. అటువంటప్పుడు ఏ కోర్టు మాత్రం ఏమి చేయగలదు తన అసహాయతను వేరే రూపంగా ఎవరిపైనో వెళ్ళగ్రక్కడం తప్ప!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close