అందరికీ ఒకే డౌట్..! కేసీఆర్ – జగన్ ఎందుకు మాట్లాడుకోరు..?

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంలో అందరికీ ఒకే పరిష్కార మార్గం కనిపిస్తోంది. సోదరి షర్మిల దగ్గర్నుంచి బీజేపీ,టీడీపీ నేతలు అందరూ ఒక్కటే అడుగుతున్నారు. దావత్‌లు చేసుకుని ఒకరి నోట్లో ఒకరు స్వీట్లు పెట్టుకున్నప్పుడు… ఇప్పుడు సమస్య వస్తే.. ఎందుకు మాట్లాడుకోరు..? అని. నిజమే కదా అని సామాన్యులకు కూడా సందేహం వస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ – వైసీపీ మధ్య బలమైన బంధం ఏర్పడింది. ఎంత బలమైన బంధం అంటే.. ఏపీలో ఏమైనాజరిగితే.. తెలంగాణలో ఫిర్యాదులు చేసి.. అక్కడ కేసులు పెట్టి.. హడావుడి చేయగలగినంత స్నేహం. ఓ రకంగా తెలంగాణ పోలీసుల్ని.. ఏపీలో రాజకీయంగా వాడుకునేందుకు కేసీఆర్ అవకాశం కల్పించారు.

నాటి దావత్‌ల ఆత్మీయత ఇప్పుడు పలకరింపులకూ కొరగావడం లేదా..?

ఆయన అంత సాయం చేశారు కాబట్టే సీఎం జగన్… విజయం సాధించగానే.. ప్రధానమంత్రి కంటే ముందుగా కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత రెండు ,మూడు సార్లు ప్రగతి భవన్‌కు వెళ్లి సమావేశం కూడా అయ్యారు. ఇప్పటికీ వారి మధ్య రాజకీయ స్నేహం ఉందని కొద్ద రోజుల కిందట.. రఘురామకృష్ణరాజును హైదరాబాద్ అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి హైదరాబాద్ పోలీసులు సహకరించిన వైనంతోనే తెలిసిపోతుందని అంచనాకు రావొచ్చు. అయితే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇటీవలి కాలంలో మళ్లీ ముఖాముఖి సమావేశం కాలేదు. కారణం ఏమిటో తెలియదు కానీ.. మొదటి విడత లాక్ డౌన్ సమయంలో… హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న హాస్టల్ విద్యార్థుల్ని ఏపీ సర్కార్ సరిహద్దుల్లోనే నిలిపివేసింది. దీంతో తెలంగాణ సర్కార్ మళ్లీ హాస్టళ్లకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా ముఖ్యమంత్రులు మాట్లాడుకోలేదు.

ఉమ్మడి ప్రాజెక్ట్ ఆలోచన నుంచి జగన్ వెనక్కి తగ్గడం వల్లే సమస్యలా..?

అప్పటి నుండి రెండురాష్ట్రాల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా మాట్లాడుకోలేదు. చివరికి మొన్న అంబులెన్స్‌లను తెలంగాణ సర్కార్ నిలిపివేసినప్పుడు కూడా.. కేసీఆర్‌తో మాట్లాడటానికి జగన్ ఇష్టపడలేదు. ఇప్పుడుజల వివాదం వచ్చినా మాట్లాడటం లేదు. దీంతో ఇరువులు ముఖ్యమంత్రులు ముఖాముఖి మాట్లాడుకోవడానికి ఇష్టపడటం లేదన్న అభిప్రాయం మాత్రం అంతటా ఏర్పడుతుంది. గతంలో కేసీఆర్ ఆంధ్రా ప్రాజెక్టులను కూడా రీ డిజైనింగ్ చేశారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌గా తెలంగాణ భూభాగంలో ఓ ప్రాజెక్టు కట్టాలని ఆలోచన చేశారు. ఒప్పందాలు చేసుకోవాలని జగన్ కూడా సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రకటించారు.

మాటల్లేకపోవడం.. రాజకీయమా..? వ్యూహమా..?

కానీ అది ట్రాప్ అని అనుకున్నారేమో కానీ.. జగన్ వెనక్కి తగ్గినట్లుగా ఉన్నారు. దీంతో కేసీఆర్‌కు ఆగ్రహం వచ్చిందేమో కానీ.. వ్యక్తిగతంగా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు చెడిపోయాయన్న ప్రచారం ప్రారంభమయింది. అయితే అది రాజకీయమా.. లేక నిజమా.. మళ్లీ ఉమ్మడి శత్రువు వారిని ఏకం చేస్తుందా అన్నది భవిష్యత్‌లో తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే.. రెండు రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రుల మధ్య పలకరింపులు లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close