బీజేపీకి తప్పని అసంతృప్తి రాజీనామాలు !

బలమైన నేతలు లేరని కిందా మీదా పడుతున్న బీజేపీకి మొదటి జాబితా ప్రకటన తర్వాత సమస్యలు మరింత పెరిగాయి. అసంతృప్తులు రాజీనామాలు ఎక్కువగా ఉన్నాయి. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఏనుగుల రాకేశ్‌ రెడ్డి తనకే టికెట్‌ వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. ఆయన మీడియాలో హడావుడి చేస్తూంటారు. కానీ ఆ స్థానాన్ని రావు పద్మకు కేటాయించారు. దీంతో రాకేష్ రెడ్డి ఫీలయ్యారు. మానకొండూరులో పార్టీ సీనియర్‌ నేత శంకర్‌కు కాకుండా ఇటీవల కొత్తగా చేరిన ఆరెపల్లి మోహన్‌కు పార్టీ టికెట్‌ కేటాయించింది. రామగుండంలో ఇటీవల చేరిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణికి టికెట్‌ ఇచ్చింది.

గోషామహల్‌ టికెట్‌ కేటాయిస్తామనే బలమైన హామీతోనే విక్రమ్‌గౌడ్‌ హస్తం పార్టీని వీడి కమలం గూటికి చేరారు. రాజాసింగ్‌పై వేటు, తదనంతర పరిణామాలతో క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారు. తీరా తొలిజాబితాలో ఆయన స్థానంలో రాజాసింగ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణకు బీజేపీ మొండిచేయి చూపించింది. ఆ స్థానం నుంచి ఎంపీ అర్వింద్‌ సూచించిన ధన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్తాకు సీటిచ్చింది. అర్వింద్‌పై లక్ష్మినారాయణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వం తనకు కేటాయించాలని డీకే అరుణ పట్టుబడుతున్నారు. జాతీయ నాయకత్వం మాత్రం ఆ సీటును మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. దీనికి ఆయన సముఖంగా లేరు. తన కొడుక్కి ఆ సీటు ఇస్తే కచ్చితంగా గెలిపించుకుని వస్తానని అంటున్నారు. ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ముథోల్ నుంచి కొత్తగా కాంగ్రెస్ నుచి వచ్చి చేరిన రామారావుపటేల్ కు టిక్కెట్ ఇచ్చారు. ఐదేళ్లు అక్కడ పని చేసుకున్న మహిళా నేత కన్నీళ్లు పెట్టుకుని పార్టీకి రాజీనామా చేశారు. రెండో జాబితాలో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే… మొదటి జాబితాలో అసంతృప్తుల్ని బుజ్జగించడం బీజేపీకి పెద్ద సమస్యగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close