కవిత అరెస్ట్ కుట్రే, ఖండించాల్సిందే : రేవంత్ రెడ్డి

కవిత అరెస్టును ఖండించాల్సిందేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె ఆరెస్టు కుట్ర ప్రకారమే జరిగిందన్నారు. అయితే రేవంత్ ఉద్దేశంలో ఆ కుట్ర బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకూ కేసీఆర్ కవిత అరెస్టుపై స్పందించలేదని తెలంగాణ పర్యటనలో ఉన్న మోదీ కూడా.. కవిత అరెస్టుపై స్పందించలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. వంద రోజుల పాలనపై మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కవిత అరెస్టుపై స్పందించారు.

ఈడీ, సీబీఐ మోదీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అనిస్పష్టం చేశారు. కవిత విషయంలో కేసీఅర్ కే ఒక విధానపరమైన నిర్ణయం లేదన్నారు. ఎన్నికల ముందు ఈ డ్రామాలు తెలంగాణ సమాజం గమనించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు నాటకం ఆడుతున్నారని.. కవిత పై తండ్రిగా కేసీఅర్ కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కనీసం మోదీ కూడా దీనిపై స్పందించలేదని గుర్తు చేశారు. కేసీఅర్, మోదీ మౌనం వెనక మతలబు ఎంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు.

కవితను ఎక్కడ అరెస్టు చేస్తారో అని కాంగ్రెస్ నేతలు కూడా కంగారు పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఇలాంటివి బీఆర్ఎస్ పై సానుభూతి పెంచుతాయనే ఆందోళన ఆ పార్టీలో కనిపించింది. నిజానికి కవితను అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరెస్టు చేసి.. బండి సంజయ్ నే అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే.. ఈ రోజ బీజేపీ .. కాంగ్రెస్ కన్నా మెరుగైన పొజిషన్ లో ఉండేదన్న అభిప్రాయం ఉంది. చివరికి .. కవిత అరెస్టు ను కాంగ్రెస్ కూడా ఖండిస్తోంది. బీజేపీ అసలు మాకేమి సంబంధమని.. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఎవరు చేయమన్నారని అంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close