రాజ‌మౌళి సినిమా… కొంచెం ముందుకొచ్చింది

రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్… ప్ర‌స్తుతం చిత్ర‌సీమ‌ని ఊరిస్తున్న సినిమా. రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న రాజ‌మౌళి ఈ సినిమాతో ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో అని అభిమానులంతా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు ఈ సినిమాకి సంబంధించిన ప‌నులన్నీ రాజ‌మౌళి చ‌క చ‌క పూర్తి చేస్తున్నారు. షూటింగ్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. న‌వంబ‌రు 18న షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని ఈమ‌ధ్యే ఓ వార్త అందింది. చిత్ర‌బృందం కూడా అదే రోజు షూటింగ్ మొద‌లెట్టాల‌నుకుంది. కానీ.. ఇప్పుడు రాజ‌మౌళి ఆలోచ‌న మారింది. అనుకున్న స‌మ‌యానికంటే ముందే ఈ సినిమాని ప్రారంభించాల‌నుకుంటున్నారు. న‌వంబ‌రు తొలి వారంలోనే… ఈ సినిమాకి కొబ్బ‌రికాయ కొట్టేస్తార‌ని స‌మాచారం. ఈసినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు చోటుంది. వాళ్లిద్ద‌రు కాక‌… ఓ విదేశీ క‌థానాయిక కూడా ఇందులో న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. అంటే.. క‌థానాయిక‌లు ముగ్గుర‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం వాళ్ల కోస‌మే అన్వేష‌ణ జ‌రుగుతోంది. తొలి షెడ్యూల్‌లో హీరోయిన్ల‌తో ప‌నిలేద‌ట‌. కేవ‌లం ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో సన్నివేశాలు పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది. ఆ త‌ర‌వాతే.. హీరోయిన్లు రంగంలోకి దిగుతారు. అందుకే… హీరోయిన్ల ఎంపిక విష‌యంలో ఎలాంటి కంగారు ప‌డ‌డం లేదు. రెండో షెడ్యూల్‌కి ముందు క‌థానాయిక‌ల్ని ఎంపిక చేసి, అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close