వైసీపీకి మహారాజపోషకుడు శేఖర్ రెడ్డి..!

తమిళనాడు వ్యాపారవేత్త శేఖర్ రెడ్డి .. అక్కడి రాజకీయ పార్టీలకు కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి భూరి విరాళం ఇచ్చారు. అది చిన్న మొత్తం కాదు. దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలు. మొత్తం వైసీపీకి ఏడాదిలో తొమ్మిదిన్నర కోట్ల రూపాయల విరాళం వస్తే అందులో ముఫ్పై శాతం శేఖర్ రెడ్డిదేనన్నమాట. అంతగా శేఖర్ రెడ్డికి వైసీపీపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో.. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల స్థాయిలో విరాళాలు ఎందుకిస్తున్నారో… అంచనా వేయడం పెద్ద కష్టమేం కాదనేది కొంత మంది చెప్పే మాట.

అరవ వ్యాపారవేత్త .. ఆయన వ్యాపారాలన్నీ తమిళనాడులోనే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తరచరూ వార్తల్లోకి వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఆయన టీటీడీ బోర్డు మెంబర్. పాత నోట్ల రద్దు సమయంలో కొత్త నోట్లు ఆయన ఇంట్లో ఆర్బీఐ చెస్ట్ రేంజ్లో బయటపడటంతో కలకలం రేగింది. అప్పట్లో ఆయన చంద్రబాబుకు బినామీ అని.. ఆ సొమ్మంతా చంద్రబాబుదేనని వాదించిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్, ఆయన మీడియా… “సాక్ష్యాలతో సహా” ఆరోపించారు. ఆ సాక్ష్యాల్నీ ఏమైపోయాయో కానీ.. తాము అధికారంలోకి రాగానే ఆయనను నెత్తిన పెట్టుకోవడం.. ప్రారంభించారు. ఆయనపై ఆరోపణలతో ఏ టీటీడీ బోర్డుపదవి నుంచి గత ప్రభుత్వం పీకేసిందో.. అదే బోర్డు పదవిని ప్రస్తుత ప్రభుత్వం అప్పగించింది. అంతే కాదు.. ఆయనకు.. ఆయనకు చెందిన కంపెనీలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

నిజానికి శేఖర్ రెడ్డి విషయంలో వైసీపీ చేసినంత రచ్చ ఇతర పార్టీలు చేసి ఉంటే… అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నీడ కూడా తమ పార్టీపై పడకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఏమైనా సంబంధాలు పెట్టుకోవాలంటే.. తెర వెనుకే పెట్టుకుంటారు. కానీ వైసీపీ ఆయనను తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్‌ను చేసింది. ఏపీలో ఇసుక విధానం మార్చింది కూడా ఆయన కోసమేనన్న ప్రచారం జరుగుతోంది. శేఖర్ రెడ్డి కి కానీ ఆయనకు సంబంధం ఉన్న కంపెనీలకు కానీ.. ఎలాంటి ప్రయోజనం ఏపీ నుంచి జరిగినా.. వైసీపీ ఇంకా ఇంకా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close