అనుకున్న‌ట్టే శ్రుతిహాస‌న్ వ‌చ్చింది

ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులోక‌థానాయిక‌గా శ్రుతిహాస‌న్ పేరు ముందు నుంచీ వినిపిస్తూ వుంది. అయితే శ్రుతి అవుడ్డేటెడ్ అయిపోయింద‌ని, తెలుగు సినిమాల‌పై ఆస‌క్తి పూర్తిగా త‌గ్గిపోయింద‌ని, కాంబినేష‌న్ కూడా ఓల్డ్ గా క‌నిపిస్తుంద‌ని.. ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపించాయి. అయితే చిత్ర‌బృందం ఇవేమీ ప‌ట్టించుకోలేదు. శ్రుతిహాస‌న్‌నే రంగంలోకి దించారు. ఈ సినిమాలో క‌థానాయిక‌గా ఆమెనే ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కాంబోలో వ‌చ్చిన `బ‌లుపు`లోనూ శ్రుతినే క‌థానాయిక‌. ఓ రకంగా ఇది `బ‌లుపు 2` అన్న‌మాట‌. ఇందులో ర‌వితేజ ఓ శ‌క్తిమంత‌మైన పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రానికి `క్రాక్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. ...

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close