ఫ్లాష్ బ్యాక్‌: చిరు టైటిల్ మార్చ‌మ‌న్న శ్రీ‌దేవి

స్టార్ డ‌మ్ ఎవ‌రికైనా ఒకేలా ప‌నిచేస్తుంది. క్రేజ్‌, ఇమేజ్ వ‌చ్చేశాక‌… `నేను ఆడిందే ఆట‌` అంటారంతా. అయితే చిత్ర‌సీమ హీరోల రాజ్యం. ఎప్పుడోగానీ హీరోయిన్ల‌కు చ‌క్రం తిప్పే అవ‌కాశం రాదు. వ‌స్తే మాత్రం విచ్చ‌ల‌విడిగా వాడుకోవాల్సిందే. దానికి అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ శ్రీ‌దేవి.

శ్రీ‌దేవి స్టార్ డ‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా… త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఒక‌ప్పుడు అత్య‌ధిక పారితోషికం తీసుకునే స్టార్ల జాబితాలో తొలి వ‌రుస‌లోనే ఉండేది. శ్రీ‌దేవి కాల్షీట్ల‌ని బ‌ట్టే.. స్టార్ హీరోల సినిమాలు ఫిక్స‌య్యేవి. అదీ.. శ్రీ‌దేవి రేంజు. అప్ప‌ట్లో త‌న క్రేజ్ ఎలా ఉండేది అనేదానికి ఓ మ‌చ్చుతున‌క ఇది.

చిరంజీవి న‌టించిన ‘కొండ‌వీటి దొంగ‌’ సినిమా గుర్తుండే ఉంటుంది. విజ‌య‌శాంతి – రాధ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. నిజానికి ఈ సినిమాలో క‌థానాయిక‌గా ముందు శ్రీ‌దేవినే అనుకున్నార్ట‌. శ్రీ‌దేవిని దృష్టిలో ఉంచుకుని హీరోయిన్ పాత్ర‌ని డిజైన్ చేసి, శ్రీ‌దేవి ద‌గ్గ‌ర‌కు వెళ్తే…. ”క‌థ బాగుంది గానీ.. టైటిల్ మార్చండి. కొండ‌వీటి దొంగ, కొండ‌వీటి రాణి అని పెట్టండి” అని చెప్పింద‌ట‌. చిరంజీవి హీరో కాబ‌ట్టి కొండ‌వీటి దొంగ అనే టైటిల్ ముందే ఫిక్స్ చేసేశారు. కానీ.. శ్రీ‌దేవి.. టైటిల్ త‌న‌పై కూడా ఉండాల్సిందే అని ప‌ట్టుప‌ట్టింది. దాంతో… శ్రీ‌దేవిని ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింది. శ్రీ‌దేవి ఎప్పుడైతే త‌ప్పుకుందో అప్పుడు ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర‌ని మార్చేసి, సోలో హీరోయిన్ సినిమా కాస్తా.. ఇద్ద‌రు హీరోయిన్ల క‌థ‌గా మార్చారు. అదే ఇప్పుడైతే.. `నా కోసం టైటిల్ మార్చండి` అని ధైర్యంగా అడిగే క‌థానాయిక ఉంటుందా? ద‌టీజ్ శ్రీ‌దేవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close