రాజమౌళి తెలుగు మీడియాను తక్కువ అంచనా వేశాడా? ట్రాప్ చేశాడా?

అసలు ఏ విషయమూ లేకపోతేనే.. ఏదో ఒకటి జరుగుతోందని గాసిప్స్ రాసేయడంలో ఇప్పుడు భారతదేశ మీడియా మొత్తం కూడా చాలా అడ్వాన్స్ అయి ఉంది. ఇక ఫలానా తేదీన ఓ గొప్ప విషయం ఉంది అని చెప్తే ఇంకేముంది? ఆ సీక్రెట్‌ని బయటపెట్టకుండా మీడియా ఉంటుందా? అదే జరిగింది. గత కొంత కాలంగా ఎప్పుడూ లేని విధంగా తెలుగు మీడియా కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ హింట్స్ ఇచ్చేశాడు రాజమౌళి. అదే కొంపముంచింది. ఐదో తేదీన అధికారికంగా ప్రకటించాలన్న రాజమౌళి ఆలోచన ఆవిరైపోయింది. దాంతో ఇక తప్పని సరి పరిస్థితుల్లో ఈ రోజే అధికారికంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. మన మీడియా వాళ్ళను ప్రభుత్వాలు, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్స్ సరిగ్గా వాడుకోవడం లేదు కానీ కరెక్ట్‌గా ఉపయోగించకుంటే పాకిస్తాన్ తీవ్రవాదుల నుంచి లోకల్‌గా ఉన్న క్రిమినల్స్ వరకూ అందరి వివరాలు చిటికెలో చెప్పేసే తెలివితేటలు వాళ్ళ సొంతం అని చాలా మంది అభిప్రాయం. పోకిరి సినిమాలో నాజర్ చెప్పినట్టుగా వీరప్పన్‌ని వెతకడం, పట్టుకోవడం పోలీసులకు కష్టమైంది కానీ మీడియా వాళ్ళకు మాత్రం అన్ని విషయాలూ తెలిసిపోతూనే ఉన్నాయి.

అయితే ఇక్కడే ఇంకో అసలు ట్విస్ట్ కూడా ఉంది. పోలీసులు, నాయకులకు కూడా వీరప్పన్ ఆనుపానులు తెలుసునని, కానీ చాలా మందికి ఆయన బినామీ కావడమో, లేక మామూళ్ళు సకాలంలో చెల్లిస్తుండడం వళ్ళో…వాళ్ళే కాపాడారని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మన జక్కన్న కూడా ఇంకాస్త ఎక్కువ రోజులు, ఎక్కువ ప్రచారం కోసం స్కెచ్ వేసి వ్యూహాత్మకంగా ప్రెస్‌మీట్‌లో ఈ విషయం గురించి హింట్స్ ఇచ్చాడేమో తెలియదు. ఎందుకంటే మీడియా వాళ్ళు ఇంకేవో విషయాలు అనుకుని, ఎక్కడెక్కడో వెతికేస్తారేమోనన్న ఉద్ధేశ్యంతో ప్రభాస్ పెళ్ళి విషయం కాదని చెప్పడంతో పాటు…అలాగే మీడియా వాళ్ళు వెతికే ప్రయత్నం చేసే కొన్ని విషయాల గురించి ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. ఈ బాహుబలి డైరెక్టర్ వ్యూహాలను, తెలివితేటలను కూడా అస్సలు తక్కువ అంచనా వేయలేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close