ప్రజా ప్రభుత్వ అధికారాలపై సుప్రీం చెప్పాల్సి రావడమే అసలు విషాదం !

ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే విషయంలో స్థానిక ఆప్ సర్కార్ కి, కేంద్రానికి నడుస్తున్న వివాదం కొలిక్కివచ్చింది. స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించబోమని స్పష్టం చేసింది. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకే నిజమైన అధికారాలు ఉంటాయని పేర్కొంది.

లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతి భద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇదే అంశంపై స్పష్టమైన తీర్పు వెలువరించింది. దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేసి ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రశ్నార్థం చేసిన వ్యవహారంపై ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడమే నిజంగా విషాదం.

కేజ్రీవాల్ వరుసగా ఢిల్లీలో సీఎం అవుతున్నారు. రాజకీయంగా బీజేపీని సవాల్ చేస్తున్నారు. అందుకే బీజేపీ.. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రాజకీయం ప్రారంభించింది. కేజ్రీవాల్ సర్కార్ అధికారాలను పరిమితం చేస్తూ.. రాజకీయం చేింది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికారాల విషయంలో స్పష్టత కరవై తరచూ వివాదాలు తలెత్తాయి. సింగిల్ జడ్జి లెఫ్టినెంట్ గవర్నర్ కే అధికారాలు ఉంటాయని తీర్పు ఇచ్చారు. నిజానికి ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమే . పూర్తి రాష్ట్ర హోదా లేదు. కానీ అక్కడ ప్రజాప్రభుత్వం ఉంది. దేశ రాజధాని కాబట్టి భద్రతావసరాలు పోలీసు వ్యవస్థ మాత్రమే కేంద్రం చేతుల్లో ఉంటుంది. మిగతా అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారి. కానీ ఆ అధికారం లాక్కోవడానికి చేయని ప్రయత్నాలే లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close