భారత విదేశాంగ మంత్రి ఇస్లామాబాద్ పర్యటన సఫలం అవుతుందా?

ఇటీవల పారిస్ జరిగిన పర్యావరణ మార్పులపై జరిగిన అంతర్జాతీయ సమావేశం వలన పర్యావరణంలో మార్పులు వచ్చినా రాకపోయినా ఆ సందర్భంగా భారత్-పాక్ ప్రధానులు నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ రెండు మూడు నిమిషాలు మాట్లాడుకొన్న మాటల వలన భారత్-పాక్ దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల బ్యాంకాక్ లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఆ తరువాత నిన్న భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ బయలుదేరి వెళ్ళారు. భారత్-పాక్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా రద్దయిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లు మళ్ళీ మొదలవబోతున్నాయి. డిశంబర్ 24 నుండి జనవరి 5వరకు శ్రీలంకలో జరుగబోయే క్రికెట్ మ్యాచ్ లలో భారత్-పాక్ కూడా ఆడబోతున్నట్లు తాజా సమాచారం.

భారత్-పాక్ దేశాల మధ్య చర్చలు మళ్ళీ ప్రారంభం అయ్యేందుకు తన పర్యటన ఉపకరిస్తుందని భావిస్తున్నట్లు సుష్మా స్వరాజ్ అభిప్రాయం వ్యక్తం చేసారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ మరియు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లతో ఆమె భేటీ అవుతారు. ఎటువంటి ముందస్తు షరతులు విధించకుండా భారత్ తో చర్చలకు సిద్దమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించడం కూడా ఇరు దేశాల మధ్య చర్చలకు సానుకూల వాతావరణం కల్పించిందని చెప్పవచ్చును. కానీ ఈ చర్చల వలన ఇరు దేశాల మధ్య శాశ్వితంగా శాంతి నెలకొంటుందనే భ్రమలో ఇరు దేశాలు లేవు. అమెరికా తదితర అగ్రరాజ్యాల ఒత్తిడి కూడా ఇరు దేశాలను చర్చలు మొదలుపెట్టేలా చేసి ఉండవచ్చును. ఈ చర్చలు వలన సమస్యలు పరిష్కారం కాకపోయినా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం తగ్గే అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close