పరిషత్ ఎన్నికల నుంచి టీడీపీ ఔట్..!

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలు ఏ మాత్రం స్వేచ్చగా జరిగే అవకాశం లేకపోవడం.. ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడం ఖాయమని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఎస్ఈసీ నీలం సాహ్నిని నిమిత్తమాత్రంగానే ఉంచుతారని.. అంతా ఇతరులు పనులు పూర్తి చేసి.. ఏపక్షంగా పోలింగ్.. కౌంటింగ్ నిర్వహింప చేసుకుంటారని ఇంత మాత్రం దానికే.. ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం ఏముందని టీడీపీ నేతలు నిర్ణయానికి వచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉండి.. వీలైనంత వరకు ఫెయిర్‌గా నిర్వహించేందుకు ప్రయత్నించినా… ప్రభుత్వ అధికార బలం ముందు సరిపోలేదు.

అదే సమయంలో ఇప్పటికే.. ఏకగ్రీవాలపై.. టీడీపీ ఫిర్యాదులు చేసి ఉంది. వాటిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. నిజానికి అసలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవద్దన్న సూచనలు.. టీడీపీకి అనేక వర్గాల నుంచి వచ్చాయి. సొంత పార్టీ నేతలు కూడా.. వేధింపులు ఎదుర్కొని.. డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినా ప్రయోజనం ఉండదని.. దౌర్జన్యాలతో వాళ్లే గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారన్న అభిప్రాయాలు వినిపించాయి. ఎన్నికలు బహిష్కరించాలన్న అభిప్రాయాన్ని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నేరుగానే చెప్పారు. అయితే నిమ్మగడ్డ స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తారన్న నమ్మకంతో ఇంత కాలం టీడీపీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంది.

ఇప్పుడు.. ప్రభుత్వం చెప్పినట్లుగా వినే… రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నీలం సాహ్నిని ఎస్ఈసీ పదవిలో కూర్చోబెట్టడంతో ఇక ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చింది. పరిషత్ ఎన్నికల ప్రక్రియ.. ఎక్కడ ఆగిపోతుందో.. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే నామినేషన్లు వేసిన టీడీపీ నేతలు.. ఉపసంహరించుకుంటారా లేకపోతే.. అలా వదిలేస్తారా అన్నది ఎన్నికల ప్రకటన వచ్చాక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close