టీడీపీ జాబితాలో సామాజిక సమతూకం ఉందా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 126 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించారు. ఇందులో… సీనియర్లతో పాటు… యువకులకూ ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత అభ్యర్థుల జాబితా ఇంత త్వరగా వెలువడటం ఇదే తొలిసారి కావడం విశేషం. మిగిలిన అభ్యర్థుల పేర్లను ఈనెల 17వ తేదీ నాటికి ప్రకటించాలని భావిస్తున్నారు. 25 లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేసి, జాబితా విడుదల చేస్తారు. తొలి జాబితాలో 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు. వీరిలో కొందరు వారసులకు అవకాశం ఇచ్చారు. బాపట్ల ఎంపీ మాల్యాద్రి అసెంబ్లీకి మారుతుండగా… జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేయనున్నారు.

తొలి జాబితాలోని 126 మందిలో 33 మంది బీసీలు కాగా… 21 మంది ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు. ఇద్దరు మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు. 70 మంది ఓసీలు ఉన్నారు. ఓసీల్లోనూ.. అన్ని సామాజికవర్గాలకు.. ప్రాతనిధ్యం కల్పించే ప్రయత్నం చేశారు. కాపులకూ… పెద్ద పీట వేశారు. అయితే ఇంకా.. 49 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇవి ఖరారు చేసిన తర్వతా.. మొత్తం 175 స్థానాలకు ఎంపికలు పూర్తయిన తర్వాతే సామాజిక సమీకరణాలపై స్పష్టత వస్తుంది.

అభ్యర్థుల విషయంలో చంద్రబాబు.. అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. కొంత మంది బలమైన నేతలు ఉన్నప్పటికి.. సామాజిక సమీకరణాల కోసం… అవకాశం ఇవ్వరు. తాడేపల్లి గూడెం అసెంబ్లీ స్థానంలో… కమ్మ సామాజికవర్గానికి చెందిన ముళ్లపూడి బాపిరాజు పోటీ చేస్తే.. విజయం ఖాయమని.. అంచనా ఉంది. కానీ.. అక్కడ సామాజిక న్యాయం కోసం.. కాపు వర్గానికి చెందిన ఈలి నానికి అవకాశం కల్పించారు. ఇలా.. మొత్తం అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత టీడీపీ చేసిన సామాజిక న్యాయంపై ఓ అంచనాకు రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close